సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ) : వానకాల సీజన్లో పప్పు దినుసుల దిగుబడిని పెంచడమే లక్ష్యంగా ఇక్రిసాట్లో జాతీయ సదస్సు జరిగింది. ఆలిండియా కో-ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో అగ్రి పరిశోధన సంస్థలు, రీసెర్చ్ నిపుణులు హాజరయ్యారు. గతేడాది నిర్దేశిత లక్ష్యాల పురోగతి, ఈ సీజన్లో చేపట్టాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా కందులు, పెసర్లు, మినుములతోపాటు పలు రకాల పప్పు దినుసుల దిగుబడిని పెంచాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఇక్రిసాట్ నిపుణులు ప్రత్యేక చర్చాగోష్ఠి నిర్వహించారు.