ఆమనగల్లు, సెప్టెంబర్ 11: ఆమనగల్లు పట్టణంలో రూ.17.50 కోట్లతో 50 పడకల ప్రభుత్వ దవాఖానకు వారం రోజుల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వైద్య ఆరోగ్య శాఖ నుంచి వెలువడినట్లు ఆయన తెలిపారు. ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ దవాఖానను సోమవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సందర్శించారు. అనంతరం దవాఖాన పరిసరాలను పరిశీలించారు. రికార్డులు, హాజరు పట్టికను పరిశీలించి వైద్య సేవల గురించి రోగులను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. అనంతరం దవాఖాన ఆవరణలో వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు నేనావత్ పత్యానాయక్తో కలిసి ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ వైద్యరంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, ఆరోగ్య తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్రమోడి దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కళాశాలు మంజూరు చేస్తే అందులో తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర సర్కార్ 32 జిల్లాలో రూ.3200 కోట్లతో 32 మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించిందన్నారు. గతంలోనే కల్వకుర్తి దవాఖానకు రూ. 17.50 కోట్లు మంజూరుకాగా, 3 ఎకరాల్లో దవాఖాన నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆమనగల్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మరో 2 ఎకరాల్లో 50 పడకల దవాఖానగా రూ.17.50 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. 2 ఎకరాల భూమిని రెండు రోజుల్లో గుర్తించాలని ఎమ్మార్వోని ఆదేశించారు. వారం రోజుల్లోనే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మెట్రో రైలు ఆమనగల్లు వరకు పొడిగించాలని సీఎంను కోరగా, సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లుకు త్రిపుల్ ఆర్ కూడా ఆమనగల్లు మండలం నుంచి వెళ్తుందన్నారు. అంతకుముందే సాయిబాబుకు రూ.18వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్, మెడికల్ ఆఫీసర్ పరిక్షీత్ నరేందర్, వైద్యులు నాగరాజు, మైమూనాబేగం, ఎంపీహెచ్వో తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ కడ్తాల్ అధ్యక్షుడు కంబాల పరమేశ్, బీఆర్ఎస్ నాయకులు నిరంజన్గౌడ్, సయ్యద్ఖలీల్, మాజీ వార్డు సభ్యుడు అల్లాజీ, సాయిలు, వెంకట్రెడ్డి, ఆంజనేయులు, పరమేశ్, ఏఎంసీ డైరెక్టర్ రమేశ్నాయక్ నాయకులు కిరణ్, సతీశ్, శివకుమార్, కంబాలపల్లి అల్లాజీ, భాస్కర్, యాదయ్య, మల్లేశ్నాయక్, శివ పాల్గొన్నారు.