బొంరాస్పేట, ఫిబ్రవరి 15 : గ్రామాల్లో అధ్వానంగా ఉన్న అంతర్గత రహదారులను జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను వికారాబాద్ జిల్లాలోని 19 మండలాల్లో 766 సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.59.03 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పనులను మార్చిలోగా పూర్తి చేయాలని డీఆర్డీఏ, ఇంజినీరింగ్ శాఖల అధికారులను ఆదేశించడంతో గ్రామాల్లో పనుల ప్రారంభానికి వారు సన్నాహాలు చేస్తున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో 206 సీసీ రోడ్లకు రూ.15.98 కోట్లు, పరిగి సెగ్మెంట్లో 209 సీసీరోడ్లకు రూ.10.05కోట్లు, తాండూరు సెగ్మెంట్లో 223 సీసీ రోడ్లకు రూ.13కోట్లు, కొడంగల్ నియోజకవర్గంలో 128 సీసీరోడ్ల నిర్మాణానికి రూ.20కోట్లు మం జూరయ్యాయి. ఈ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేకాధికారులు గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేశారు.
గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి నిధులు(ఏసీడీఎఫ్), ఉపాధిహామీ పథకం నిధులను మంజూరు చేస్తున్నారు. ఇవేకాకుండా మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ నిధులతోనూ సీసీ రోడ్లను పెద్ద ఎత్తున చేపడుతుండడంతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తం లో నిధులు మం జూరు చేస్తుండడంతో ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో గ్రామాల వారీగా సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరైన నిధులు ఇలా ఉన్నాయి. బాపల్లితండాకు రూ.10లక్షలు, బాపన్చెరువుతండాకు రూ.10లక్షలు, బొంరాస్పేటకు రూ.20లక్షలు, బొట్లవానితండాకు రూ.10 లక్షలు, బురాన్పూర్కు రూ.15లక్షలు, బుర్రితండాకు రూ.10లక్షలు, చౌదర్పల్లికి రూ.15లక్షలు, దుప్చెర్లకు రూ.10 లక్షలు, ఎన్నెమీదితండాకు రూ.10లక్షలు, ఏర్పుమళ్లకు రూ.15 లక్షలు, గట్టెగానితండాకు రూ.10లక్షలు, జానకంపల్లికి రూ.10 లక్షలు, కాకర్లగండితండాకు రూ.10లక్షలు, కొత్తూరుకు రూ.15 లక్షలు, కూబ్యానాయక్తండాకు రూ.10లక్షలు, లింగన్పల్లికి రూ.15 లక్షలు, లోతుకుంటతండాకు రూ.10లక్షలు, మూడుమామిళ్లతండాకు రూ.10 లక్షలు, మదన్పల్లికి రూ.15లక్షలు, మదన్పల్లితండాకు రూ.10 లక్షలు, మహాంతిపూర్కు రూ.15లక్షలు, మేడిచెట్టుతండాకు
రూ.10 లక్షలు, మెట్లకుంటకు రూ.15లక్షలు, నాగిరెడ్డిపల్లికి రూ.10లక్షలు, నాందార్పూర్కు రూ.15లక్షలు, రేగడిమైలారానికి రూ.20లక్షలు, సాలిండాపూర్కు రూ.10లక్షలు, సూర్యానాయక్తండాకు రూ.10 లక్షలు, టేకులగడ్డతండాకు రూ.10లక్షలు, తుంకిమెట్లకు రూ.15 లక్షలు, వడిచెర్లకు రూ.15 లక్షలు, ఎనికేపల్లికి రూ.15 లక్షలు, ఎన్నెమీదితండాకు రూ.10లక్షలు, అల్లికాన్పల్లికి రూ.25లక్షలు, హంసాన్పల్లికి రూ.10లక్షలు, చిల్ముల్మైలారానికి రూ.20లక్షలు, దుద్యాలకు రూ.80లక్షలు, ఎక్కచెరువుతండాకు రూ.10లక్షలు, ఈర్లపల్లికి రూ. 10లక్షలు, గౌరారానికి రూ.15లక్షలు, లగచెర్లకు రూ.60లక్షలు, నా స్కంపల్లికి రూ.10లక్షలు, రోటిబండతండాకు రూ.10 లక్షలు, సాగారంతండాకు రూ.10లక్షలు, సంట్రకుంటతండాకు రూ.10 లక్షలు, సత్తుర్కుటంతండాకు రూ.15 లక్షలు, చెట్టుపల్లితండాకు 15 లక్షలు మంజూరయ్యాయి.
వికారాబాద్ మండలానికి 33 సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.3 కోట్లు, ధారూరులో 48 సీసీ రోడ్లకు రూ.2.5 కోట్లు, మోమిన్పేటలో 41సీసీ రోడ్లకు రూ.3 కోట్లు, మర్పల్లిలో 30 సీసీ రోడ్లకు రూ.2.63 కోట్లు, బంట్వారంలో 30 సీసీ రోడ్లకు రూ.2.85 కోట్లు, కోట్పల్లిలో 24 సీసీ రోడ్లకు రూ.2 కోట్లు, పరిగిలో సీసీ 46 రోడ్లకు రూ.2.20 కోట్లు, పూడూరులో 51 సీసీ రోడ్లకు రూ.2.50 కోట్లు, దోమలో 52 సీసీ రోడ్లకు రూ.2.53 కోట్లు, కులకచర్లలో 44 సీసీరోడ్లకు రూ.2.09 కోట్లు, చౌడాపూర్లో 16 సీసీ రోడ్లకు రూ.73 లక్షలు, తాండూరులో 52 సీసీ రోడ్లకు రూ.3 కోట్లు, పెద్దేముల్లో 53 సీసీరోడ్లకు రూ.కోటి, యాలాలలో 57 సీసీ రోడ్లకు రూ.3 కోట్లు, బషీరాబాద్లో 46 సీసీ రోడ్లకు రూ.3 కోట్లు, బొంరాస్పేటలో 55 సీసీ రోడ్లకు రూ.7.20 కోట్లు, దౌల్తాబాద్లో 36 సీసీరోడ్లకు రూ.6.05 కోట్లు, కొడంగల్ మండలంలో 37 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.6.75 కోట్లు మంజూరయ్యాయి.