ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం అంబరాన్నంటాయి. గ్రామా లు, పట్టణాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాలయాలు, సంఘాల ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. భారత్ మాతాకీ జై నినాదాలతో ఆవరణలు మార్మోగాయి. ఈ సందర్భంగా మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు.
ప్రతి ఒక్కరూ జాతీయ జెండా స్టిక్కర్లు ధరించి దేశభక్తిని చాటారు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభ్బాయ్ పటేల్ తదితర ఎందరో త్యాగధనుల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం రాగా.. 1950 జనవరి 26న ప్రపంచంలోనే గొప్ప సర్వసత్తాక, ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అవతరించి నేటికీ 75 ఏండ్లు పూర్తైంది.
-రంగారెడ్డి/వికారాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ)