ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 26 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శుక్రవారం ఘనంగా గణతంత్రదినోత్సవం ఘనంగా జరిగింది. వాడవాడలా మువ్వన్నెల జెండాలను ఎగురవేశారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఆర్డీవో అనంతరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఇబ్రహీంపట్నం కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు, మున్సిపల్ కార్యాలయం దగ్గర కమిషనర్ రవీంద్రసాగర్, ఏసీపీ కార్యాలయంపై ఏసీసీ శ్రీనివాస్రావు, ఇబ్రహీంపట్నం మార్కెట్యార్డుపై చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, అటవీశాఖ డివిజన్ కార్యాలయం వద్ద రేంజ్ ఆఫీసర్ విష్ణువర్ధన్.
మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ కృపేశ్, తహసీల్దార్ కార్యాలయంపై తహసీల్దార్ ఆర్టీసీ డిపోపై డీఎం, వ్యవసాయశాఖ డివిజన్ కార్యాలయంపై ఏడీఏ సత్యనారాయణ, ఐకేపీ కార్యాలయం ఎదుట ఏపీఎం రవీందర్తో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే, ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ జెండావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి హాజరై జెండా ఎగురవేశారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
షాద్నగర్టౌన్ : షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆవిష్కరించి వందనం చేశారు. అదే విధంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పార్థసారథి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వెంకటమాధవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయం ఎదుట ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు, మహనీయులు వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ గణతంత్ర దినోత్సవాల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్రెడ్డి, భీష్వ కిష్టయ్య పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. మున్సిపాలిటీలోని సోలిపూర్ గ్రామంలోని పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీ విద్యార్థులకు కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో బహుమతులను సంఘం నాయకులు శ్రీనివాస్, శివకుమార్, శేఖర్, మహేశ్, హరీశ్ అందజేశారు.
షాద్నగర్ కోర్టు ఆవరణలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి జీవన్సూరజ్సింగ్, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ రంగస్వామి, పోలీస్స్టేషన్లో సీఐ ప్రతాప్లింగం, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో ట్రాఫిక్ ఎస్ఐ రవీందర్నాయక్, వైద్య డివిజన్ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్వో జయలక్ష్మి, వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏడీ రాజారత్నం, మున్సిపాలిటీలోని 20వ వార్డులో, గాంధీనగర్కాలనీలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు.
ఫరూఖ్నగర్ మండలంలో ఆయా గ్రామాల్లో ఆయా సర్పంచులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ జెండాకు వందనం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, వైస్ ఎంపీపీ మౌనిక, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్ వెంకట్రాంరెడ్డి, సర్వర్పాషా, జీ.టీ శ్రీనివాస్, శ్రీనివాస్, అంతయ్య, కొందూటి మహేశ్వరి, విశాల, సరిత, ప్రేమలత, పావని, కౌసల్య, శారద, మానస, ఎంపీడీవో వినయ్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఏవో నిశాంత్కుమార్, ఎంఈవో శంకర్రాథోడ్, వివిధ పార్టీల నాయకులు గోపాల్, బాబర్ఖాన్, తిరుపతిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, బాల్రాజు, మసూద్ఖాన్, సురేశ్, మోహన్ పాల్గొన్నారు.
షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల ముందు జాతీయ జెండాలను ఎగురవేసి ఘనంగా గణతంత్ర దినోత్సవాలను జరుపుకొన్నారు. మండలాల్లోని ఆయా గ్రామాల్లో సర్పంచ్లు, పోలీస్స్టేషన్లలో గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఆర్డీవో కార్యాలయం వద్ద ఆర్డీవో సాయిరాం, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ విజయలక్ష్మి, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కిష్టయ్య, చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ శైలజాఆగిరెడ్డి, సహకార సొసైటీ కార్యాలయం వద్ద చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, క్యాంపు కార్యాలయంతో పాటు ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన జెండా వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో, పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, డిప్యూటీ తహసీల్దార్, నాయకులు, వీఆర్వోలు గ్రామ పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పంచాయతీరాజ్ కార్యాలయంలో డీఈఈ శ్రీనివాస్, మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఫరూఖ్హుస్సేన్, జూనియర్ సివిల్ కోర్టు కార్యాలయంలో జడ్జీ స్వరూప, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లలిత, పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకటేశ్వర్లు, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ వెంకటేశ్గుప్తా, సెర్ప్ కార్యాలయంలో ఏపీఎం వెంకట్రెడ్డి, మండల వ్యవసాయ కార్యాలయంలో ఏవో అరుణకుమారి, ఎంఈవో కార్యాలయంలో ఇన్చార్జి ఎంఈవో సర్దార్నాయక్, అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మహేశ్, ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీవో సక్కుబాయి, పశు వైద్యశాల భవనంలో రుద్రాక్షల విజయ్కుమార్.
ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ బద్యనాథ్ చౌహాన్, మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్సుందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సెక్రటరీ సరోజ, బీఆర్ఎస్ మండల, మున్సిపల్ పార్టీ కార్యాలయాల్లో పోనుగోటి అర్జున్రావు, నేనావత్ పత్యానాయక్, వర్తక సంఘం కార్యాలయంలో పాండురంగయ్య జాతీయ పతకాలను ఎగురవేశారు. జెండా కార్యక్రమంలో నాగర్కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీసింగ్, ఎంపీపీ నేనావత్ అనిత, జడ్పీటీసీ అనురాధ, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, నారాయణ, మున్సిపాల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, ఏంపీవో శ్రీలత, ఏఈ కృష్ణయ్య, సీఈవో గోరటి దేవేందర్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షుడు జగన్, వి.మానయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకుడు కృష్ణానాయక్, వి.శ్రీశైలం, నాయకులు యాదయ్య, మల్లయ్య, సయ్యద్ ఖలీల్, నిరంజన్గౌడ్, అల్లాజీ, సాయిలు, మెకానిక్ బాబా, రవీందర్, విజయ్రాథోడ్, శ్రీకాంత్, ఫరీద్, కౌన్సిలర్స్, తదితరులు పాల్గొన్నారు.
షాబాద్ : షాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చిన్నప్పలనాయుడు, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, పోలీస్స్టేషన్లో సీఐ యాదయ్యగౌడ్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద చైర్మన్ గూడూర్ నర్సింగ్రావు, సహకార సంఘం కార్యాలయం వద్ద చైర్మన్ చల్లా శేఖర్రెడ్డి, వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద ఏవో వెంకటేశం జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులున్నారు.
పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేటలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ సంపూర్ణారెడ్డి, కౌన్సిలర్లతో కలిసి కమిషనర్ ఎస్ రవీందర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మంచాల : మంచాల పోలీస్స్టేషన్లో ఎస్సై రవినాయక్, రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ కేవీవీ ప్రసాద్రావు, ఎంపీడీవో కార్యాలయం, ఎంపీపీ నర్మద, విద్యుత్ కార్యాలయం వద్ద ఏఈ సత్యనారాయణ, ఎంఈవో కార్యాలయం వద్ద ఇన్చార్జి ఎంఈవో వెంకట్రెడ్డి, గిరిజన బాలికల వసతి గృహంపై ప్రిన్సిపాల్ శ్రీలతారెడ్డి, ప్రభుత్వ కళాశాలపై ప్రిన్సిపాల్ తిరుపతయ్య, సహకార సంఘం కార్యాలయంపై చైర్మన్ పుల్లారెడ్డి, గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచ్లు జాతీయ జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నిత్య, వైస్ ఎంపీపీ రాజేశ్వరి పాల్గొన్నారు.
యాచారం : యాచారం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీకాంత్రెడ్డి, మండల పరిషత్కార్యాలయం వద్ద ఎంపీడీవో విజయలక్ష్మి, పోలీస్స్టేషన్ వద్ద సీఐ సైదయ్య, పంచాయతీ కార్యదర్శులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో యువకులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, ఎంపీవో ఉమారాణి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కడ్తాల్ : మండల కేంద్రంతోపాటు పరిధిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ ముంతాజ్, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, పోలీస్స్టేషన్ వద్ద సీఐ శివప్రసాద్, పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, బురుజు కోట వద్ద ఉప సర్పంచ్ రామకృష్ణ, పీఏసీఎస్ కార్యాలయం వద్ద చైర్మన్ వెంకటేశ్గుప్తా, వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద ఏవో శ్రీలత, పశువైద్యశాల వద్ద భానునాయక్, గాంధీజీ విగ్రహం వద్ద సాయిరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెంకటేశ్, అంబేద్కర్ విగ్రహం వద్ద నర్సింహ, మాల మహానాడు ఆధ్వర్యంలో భిక్షపతి, వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మాధవులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ రంగారెడ్డి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో శ్రీకాంత్, పోలీస్స్టేషన్ వద్ద ఎస్ఐ శ్రీనివాస్, పీఏసీఎస్ కార్యాలయం వద్ద చైర్మన్ కేశవరెడ్డి, వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద ఏవో రాజు జాతీయ జెండాలను ఎగురవేశారు.
అబ్దుల్లాపూర్మెట్ : అబ్దుల్లాపూర్మెట్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రేఖామహేందర్గౌడ్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవీందర్దత్తు, పోలీస్స్టేషన్లో సీఐ మన్మోహన్యాదవ్, గ్రామపంచాయతీ కార్యాయలయంలో సర్పంచ్ చెరుకు కిరణ్కుమార్గౌడ్ జాతీయ జెండాలను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అంతకుముందు స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, పలు పార్టీలు, యువజన సంఘాల నాయకులు ఉన్నారు.
చేవెళ్ల రూరల్ : చేవెళ్ల మండల పరిధి గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు జాతీయ జెండాలను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.
మొయినాబాద్ : మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ గౌతంకుమార్, పోలీస్స్టేషన్ వద్ద సీఐ పవన్కుమార్రెడ్డి, పీఏసీఎస్ కార్యాలయం వద్ద చైర్మన్ మందడి చంద్రారెడ్డి, రైతు వేదిక వద్ద ఏవో రాగమ్మ, ఆయా గ్రామ పంచాయతీల వద్ద సర్పంచ్లు . డివిజన్ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. చేవెళ్ల, చిలుకూరు, బంట్వారం, శంకర్పల్లి గురుకుల పాఠశాలల వద్ద విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
శంకర్పల్లి : శంకర్పల్లి మండల, మున్సిపాలిటీలో శంకర్పల్లి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జ్ఞానేశ్వర్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వెంకయ్య, తహసీల్దార్ కార్యాలయం ఎదుట తహసీల్దార్ సురేందర్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీప్రవీణ్కుమార్, ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ రాజూనాయక్, సర్పంచులు సుమిత్రా మోహన్రెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణ, లలితా నర్సింహ, ఎంపీటీసీ సరిత, కిషన్సింగ్, కురుమ వెంకటేశ్, అనిల్ పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరు వార్డు కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధరాంరెడ్డితో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కంబాలపల్లి ధన్రాజ్, బాలరాజు, బాగ్యమ్మ, శ్రీలత, మంగమ్మ, శివలింగం, ఉదయశ్రీ, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, నాయకులు దాసరి సుధాకర్రెడ్డి, సామ భీంరెడ్డి, వంగేటి గోపాల్రెడ్డి, కుంట గోపాల్ తదితరులు ఉన్నారు.
తుర్కయాంజాల్ రైతు సేవా సహకార సంఘంలో : తుర్కయాంజాల్ రైతు సేవా సహకార సంఘం ప్రధాన కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డైరెక్టర్లు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.
ఆదిబట్ల : ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ అమరేందర్రెడ్డి, పోలీస్స్టేషన్లో సీఐ రఘువీర్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కళమ్మ, బీఆర్ఎస్ నాయకులు కోరే జంగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లబోలు పాండురంగారెడ్డి మున్సిపల్ సిబ్బంది పోలీస్స్టేషన్లో ఎస్ఐలు కిష్ణయ్య, శ్రీనివాస్, వెంకటేశ్పాటుతో సిబ్బంది పాల్గొన్నారు.
నందిగామ : నందిగామ, కొత్తూరు ఎంపీడీవో కార్యాలయాల్లో ఎంపీపీలు ప్రియాంకగౌడ్, మధుసూదన్రెడ్డి, కొత్తూరు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్యయాదవ్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్లు అయ్యప్ప, జానకి, పోలీస్స్టేషన్లలో సీఐలు ప్రసాద్, నర్సింహారెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు.