మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా వికారాబాద్ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మహిళలు ఆర్థికంగా రాణించేందుకు వడ్డీలేని, స్వల్ప వడ్డీతో కూడిన రుణాలను మంజూరు చేస్తున్నది. వీటితో కిరాణా దుకాణాలు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం, కూరగాయల వ్యాపారం వంటివాటిని ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.463 కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేయడమే లక్ష్యంగా అధికారులు నిర్ణయించుకున్నారు.
ఇందులో ఇప్పటివరకు రూ.356 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల(76.89 శాతం)ను ఎస్హెచ్జీలకు అందజేయగా.. నెలాఖరులోగా లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా 657 గ్రామ సంఘాలు, 13,213 స్వయం సహాయక సంఘాలు ఉండగా అందులో 1.80 లక్షల మంది సభ్యులు ఉన్నారు. కాగా, గతేడాది రుణాల పంపిణీ టార్గెట్ రూ.450 కోట్లు కాగా, లక్ష్యానికి మించి రూ.499 కోట్ల్లు మంజూరు చేశారు.
-వికారాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాం గం చర్యలు చేపట్టింది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగా మహిళలను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు వడ్డీలేని రుణాలతోపాటు స్వల్ప వడ్డీతో కూడిన రుణాలను మం జూరు చేస్తున్నది. మహిళా సంఘాల సభ్యులు అధికంగా కిరాణాషాపులు, కూరగాయాల వ్యాపారం చేసేందుకు.. గేదె లు, గొర్రెలు, మేకలను కొనేందుకు రుణాలు తీసుకుంటున్నా రు.
అయితే జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ)లకు రూ.463 కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 4,970 ఎస్హెచ్జీలకు రూ. 356. 14 కోట్ల రుణాలను (76.89 శాతం మేర) మంజూరు చేశా రు. అయితే నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది రూ.450 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని లక్ష్యానికి మించి రూ.499 కోట్ల రుణాలను బ్యాంకర్లు మంజూరు చేశారు. జిల్లాలో 657 గ్రామ సంఘాలుండగా, 13,213 స్వయం సహాయక సంఘాలున్నాయి.
అందులో 1.80 లక్షల మంది సభ్యులున్నారు. ఎప్పటికప్పుడు రుణాలు చెల్లిస్తున్న ఎస్హెచ్జీలకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కాగా ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు. సంఘాల పనితీరును బట్టి పలు సం ఘాలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.20 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఎస్హెచ్జీలకు (76.89 శాతం మేర) రూ.356.14 కోట్ల రుణాలను బ్యాం కర్లు మంజూరు చేశారు. అత్యధికంగా బంట్వారం మండలం లో లక్ష్యానికి మించి 102 శాతం మేర రుణాలను మంజూరు చేయగా.. యాలాల మండలంలో 94.50 శాతం, మోమిన్పేట మండలంలో 92.71 శాతం, కోట్పల్లి మండలంలో 89.71శాతం, తాండూరు మండలంలో 84.64శాతం, నవాబుపేట మండలంలో 83.35శాతం, పరిగి మండలంలో 76 శాతం, మర్పల్లి మండలంలో 78.65శాతం, కులకచర్ల మండలంలో 78.46శాతం, బషీరాబాద్ మండలంలో 77 శాతం, చౌడాపూర్ మండలంలో 76.93శాతం, ధారూరు మండలంలో 75.82 శాతం, వికారాబాద్ మండలంలో 72.93 శాతం, కొడంగల్ మండలంలో 71.42 శాతం మేర బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో మూడు నెలలు గడువున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని మండలాల్లోనూ లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేసేందుకు జిల్లా డీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటివరకు 4,970 ఎస్హెచ్జీలకు రూ.356.14 కోట్ల రుణాలను మంజూరు చేశారు. మోమిన్పేట మండలంలో 29.17 కోట్లు, యాలాల మండలంలో రూ.22.78 కోట్లు, బషీరాబాద్ మండలంలో రూ.22.40 కోట్లు, తాండూరు మండలంలో రూ.22.29కోట్లు, దోమ మండలంలో రూ. 21.93 కోట్లు, కులకచర్ల మండలంలో 20.95 కోట్లు, నవాబుపేట మండలంలో 20.67కోట్లు, పరిగి మండలంలో 18.94 కోట్లు, బొంరాస్పేట మండలంలో 18.39 కోట్ల రుణాలను మంజూరు చేశారు. మరోవైపు జిల్లాలో ఎన్పీఏ (పనిచేయని సంఘాలు)లపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
రుణాలు తిరిగి చెల్లించని సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను నిలిపేశారు. అదేవిధంగా విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గ్రామీణ మహిళలు వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు. అయితే జిల్లాలో ఇప్పటివరకు 2,500 మంది స్వయం సహాయక సంఘాల స భ్యులు వ్యాపారులుగా మారారు. వారికి బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, గ్రామసంఘం నిధుల ద్వారా సుమారు రూ. 30 కోట్ల రుణాలను అందజేశారు. విలేజ్ ఎంటర్ప్రైజెస్లో ఎంపికైన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వ్యా పారం చేసుకునేందుకు ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు వంద శాతం రుణాల ను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు 76శా తం మేర రుణాలను మం జూ రు చేసిన దృష్ట్యా లక్ష్యానికి మించి రుణాలు మం జూ రు చేస్తాం. అన్ని మండలాల్లోనూ వందశాతం రుణాలను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్థిక చేయూతతో ఎస్హెచ్జీలు ఆర్థికంగా ఎదుగుతున్నాయి.
– కృష్ణన్, వికారాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి