వికారాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి ఫలితాల్లో జిల్లా అట్టడుగులో నిలిచింది. మంగళవారం విడుదలైన టెన్త్ రిజల్ట్లో ఈ ఏడాది కూడా చివరి స్థానంతో సరిపెట్టుకున్నది. ప్రభుత్వ బడుల్లో డిసెంబర్ నుంచి పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించినా ఆశించిన ఫలితాలను మాత్రం రాబట్టలేకపోయారు. అయితే సర్కారు బడుల్లో చదివిన స్టూడెంట్స్పై మొదటి నుంచి దృష్టి సారించకుండా కేవలం పరీక్షల సమయంలోనే ఉత్తీర్ణులయ్యేలా ఒత్తిడి తీసుకురావడంపై జిల్లా విద్యాశాఖ అధికారులపై విమర్శలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులపై సంబంధిత అధికారుల అజమాయిషీ లేకుండాపోయిందనే ఆరోపణలున్నా యి. దీంతో ప్రైవేట్ బడులతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో 50 శాతం మేర కూడా ఫలితాలు రాలేదు. నాణ్యమైన ఉపాధ్యాయులున్నా ప్రతి ఏటా సర్కారీ స్కూళ్లలో ఉత్తీర్ణతాశాతం తగ్గుతూ వస్తున్నది.
జిల్లాలో 65.10 శాతం ఉత్తీర్ణత…
టెన్త్ ఫలితాల్లో జిల్లా 65.10శాతం ఉత్తీర్ణత సాధించింది. గతేడాదితో పోలిస్తే కొంతమేర పెరిగింది. గతేడాది ఫలితాల్లో జిల్లాలో 59.46శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది 65.10 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 13,357 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయగా అందులో 8,695 మంది ఉత్తీర్ణులయ్యారు. 6,664 మం ది బాలురు పరీక్షలకు హాజరుకాగా 3,821మంది, బాలికలకు సంబంధించి 6,693 మం ది పరీక్షలు రాయగా 4,874 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 72.82 శాతం, బాలురు 57.34 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పదోతరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పదికి పది పాయింట్లు సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చారు. 64 మంది విద్యార్థులు పదికి పది పాయింట్లు సాధించగా.. ప్రభుత్వ, ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన 9 మంది విద్యార్థులు 10\10 పాయింట్లు సాధించి తామూ తక్కువేం కాదని నిరూపించారు. అయితే పదికి పది పాయింట్లు సాధించిన తొమ్మిది మంది విద్యార్థుల్లో ఆరుగురు ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులుండడం గమనార్హం. గురుకుల పాఠశాలల్లో 98.68%, కేజీబీవీల్లో 65%, మాడల్ స్కూళ్లలో 61.14%, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 97.43%, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 90%, బీసీ సంక్షేమ పాఠశాలల్లో 90 శాతానికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
మండలాల వారీగా సాధించిన ఉత్తీర్ణతాశాతం ఇలా..