కొడంగల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది చిట్లపల్లి
మధుసూదన్రెడ్డి బీఆర్ఎస్లో చేరగా గులాబీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న మంత్రి మహేందర్రెడ్డి
చేవెళ్ల రూరల్, నవంబర్ 5 : చేవెళ్ల మండల పరిధి ఇబ్రహీంపల్లి, దామరగిద్ద, ఆలూరు, న్యాలట, ఊరెళ్ల,
నారాయణ్దాస్గూడ, కుమ్మెర, ఖానాపూర్, పామెన, బస్తేపూర్ గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్
పార్టీల నాయకులు 500 మంది ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో ఆదివారం
బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పరిపాలనను ప్రతి
ఒక్కరూ కోరుకుంటున్నారని, అందుకే కారు స్పీడ్ తగ్గడం లేదన్నారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత
ఇస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా పార్టీ పటిష్టత, వచ్చే
ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలని, అందరికీ అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఎంపీ, ఎమ్మెల్యే
హామీ ఇచ్చారు.
ఇబ్రహీంపట్నం : నియోజకవర్గంలోని అనేక గ్రామాలు, మున్సిపాలిటీల నుంచి సుమారు రెండువేల
మందికి పైగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఆయన తనయుడు ప్రశాంత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో
మంచాల మండలంలోని ఆరుట్ల, చిత్తాపూర్, యాచారం మండలంలోని మాల్ గ్రామాల నుంచి
ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి
మాట్లాడుతూ.. ఐదేండ్లకోసారి ఎన్నికల సమయంలోనే వచ్చిపోయే కపట కాంగ్రెస్ నాయకులను
ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మరోసారి
బీఆర్ఎస్కు పట్టం కట్టాలని సూచించారు. బీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు
ఆకర్షితులై పెద్దఎత్తున పలు పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసల పరంపర కొనసాగుతున్నదని
పేర్కొన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్తోనే మరింత అభివృద్ధి మెరుగుపడుతుందని ఆయన తెలిపారు.
తుర్కయాంజాల్ : బీఆర్ఎస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతున్నది. బండరావిరాలకు కాంగ్రెస్
పార్టీకి చెందిన 100 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీ అబ్దుల్లాపూర్మెట్ మండల అధ్యక్షుడు కొత్త
కిషన్గౌడ్ ఆధ్వర్యంలో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి సూరజ్నగర్ కాలనీలో ఎమ్మెల్యే మంచిరెడ్డి
సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం
చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూస్తున్న ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
ఎన్ఎస్ఆర్ నగర్ కాలనీకి చెందిన 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాగన్నగూడ మాజీ సర్పంచ్
కందాడి లక్ష్మారెడ్డి, ధనుంజయ్ ఆధ్వర్యంలో.. లక్ష్మీనగర్ కాలనీకి చెందిన 30 మంది.. రాగన్నగూడ
రాజీవ్ గృహకల్పకు చెందిన 40 మంది కాలనీ వాసులు కూడా ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు.
పెద్దఅంబర్పేట : మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే
మంచిరెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధి పెద్దఅంబర్పేటలోని మైత్రి సిరిపురం, సూర్యవంశీ కాలనీ,
సాయినగర్ కాలనీల్లో, కుంట్లూరులో పెద్దఎత్తున యువకులు, వివిధ పార్టీల నాయకులు, మహిళలు
బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. దోచుకునే మాయగాళ్లు
వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని చెప్పారు. ఆరు గ్యారెంటీలు దేవుడెరుగు..
అసలు కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదని విమర్శించారు.
ఆలోచించి.. అభివృద్ధి చేసే బీఆర్ఎస్కు మరోసారి ఓటేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని, మరింత అభివృద్ధి చేయాల్సి ఉన్నదని చెప్పారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, కొత్త కాలనీల్లోనూ అన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేశామని పేర్కొన్నారు. ఆదివారం ఒక్కరోజే నియోజకవర్గంలో దాదాపు వెయ్యి మంది బీఆర్ఎస్లో చేరారని, అభివృద్ధి చూసే పార్టీలోకి వలసలు వస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
మర్పల్లి : బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్
మెతుకు ఆనంద్ ఆన్నారు. బంట్వారం మండలంలోని మాలసోమారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ
మాజీ సర్పంచ్ నర్సింహులు, సీనియర్ నాయకులు రాజుగౌడ్, శేఖర్ సేట్, అంజయ్యతో పాటు మరో
పదిమంది నాయకులు ఆనంద్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన
సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో
గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.
బొంరాస్పేట/కొడంగల్ : బొంరాస్పేట మండలంలోని లింగన్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలు హన్మంతు, బుగ్గప్ప, శ్రీనివాస్, మధు, గొల్ల హన్మంతు, హనీం, అన్వర్, అనిల్, రామకృష్ణ,
ఏ.హన్మంతు, శివ, డి.అనిల్, నరేశ్, రాజు, ఆంజనేయులు, బాలరాజు, పరశురాం, ఎల్లప్ప, నర్సింహులు,
రమేశ్, ఇస్వప్ప, ప్రసాద్ తదితరులు 60 మంది ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో
చేరారు. కొడంగల్ మండలంలోని అంగడిరాయిచూర్ గ్రామంలో వార్డు సభ్యులు అబ్దుల్ అజీజ్,
వెంకటమ్మ, రాములమ్మ రంజిత్, నవీన్, పవన్ తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
గుండుమాల్ మండలం భక్తిమళ్ల గ్రామానికి చెందిన బాలయ్య, వెంకట్రాములు, రాఘవేందర్రెడ్డి,
దిలీప్రెడ్డి, పరశురాం, పర్సు అనేమ్, గోవిందు అనేమ్, శ్రీకాంత్, కొండయ్య, ఎంకప్ప, కార్తీక్,
పురుషోత్తం తదితరులు బీఆర్ఎస్లో చేరారు. మద్దూరు మండలం దోరేపల్లి గ్రామానికి చెందిన
కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ విజయానికి కలిసికట్టుగా కృషి
చేయాలని పిలుపునిచ్చారు.
దౌల్తాబాద్ : దౌల్తాబాద్ మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీల నుంచి 180
మంది యువకులు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టి వందల కోట్ల
నిధులను ఖర్చు చేసినట్లు.. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, అంతర్గత రోడ్లు, మిషన్ భగీరథ పథకంతో
తాగునీరు, రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, వృద్ధులకు పింఛన్లు, దళిత బంధు, బీసీ బంధు, అన్ని
వర్గాలకు కల్యాణలక్ష్మి పథకం, మిషన్ కాకతీయ పథకంలో చెరువుల అభివృద్ధి, నిరుద్యోగలకు స్వయం
ఉపాధి రుణాలు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం
బీఆర్ఎస్ పార్టీ అన్నారు.
తాండూరు : భారత రాష్ట్ర సమితి కార్యకర్తలే తన బలం.. బలగమని తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థి,
ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరులోని తన నివాసంలో తాండూరు
పట్టణంలోని ముస్లింలు, యాలాల మండలం బండమీదిపల్లి గ్రామస్తులతోపాటు నియోజకవర్గంలోని
పలువురు ముఖ్య నేతలు, ప్రజలు బీఆర్ఎస్లో చేరారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు
ఆకర్షితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరినట్లు ప్రజలు తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు
ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేను గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే
రోహిత్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా తాండూరులో అభివృద్ధికి కృషి
చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ భారీ
మెజార్టీతో విజయం సాధించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు.
తాండూరు రూరల్ : తాండూరు మండలం, చంద్రవంచ గ్రామ ఉసర్పంచ్ సావిత్రి ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. రోహిత్రెడ్డి తాండూరు అభివృద్ధికి ఎనలేని కృషి
చేశారన్నారు. భారీ మెజార్టీతో రోహిత్రెడ్డిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
కోస్గి : గుండుమాల్ మండల కేంద్రంలోని భక్తిమళ్ల గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన
యువకులు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారిలో
మాలే బాలయ్య, ఈడికి వెంకట్ రాములు, రాఘవేందర్రెడ్డి, తూర్పు దిలీప్రెడ్డి, పరశురాం, పగిడాల
పరశురాములు, ఆనంద్, గోవింద్, శ్రీకాంత్, మాలే రామకృష్ణ, ఒగ్గని కొండయ్య, పగిడాల నరసింహ,
గుజ్జా చిన్న శ్రీను, పగిడాల విష్ణు, ఆనిగాళ్ల వెంకటప్ప, కార్తీక్, పురుషోత్తం, నాగరాజ్, మహమూద్
ఉన్నారు.
పరిగి : బీఆర్ఎస్లో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి
తెలిపారు. జడ్పీ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్ మహమూద్ ఆధ్వర్యంలో పరిగిలోని న్యామత్నగర్కు
చెందిన మైనార్టీ నాయకులు సయ్యద్ ఆవేజ్ హుస్సేనీ, హైదర్ హుస్సేనీ, ఎస్.అలీ, ఎస్.హస్టర్,
ఎస్.బాదల్, ఎస్.తారక్, ఎస్.తజ్ముల్, ఎస్.సైఫ్, అమీర్లతోపాటు 25 మంది కాంగ్రెస్ కార్యకర్తలు,
మాదారం సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు 30 మంది, మహ్మదాబాద్ మండలం
గాధిర్యాల్ సర్పంచ్ పి.వెంకటరాంరెడ్డి, నాయకులు హుస్నాబాద్ వెంకటరాంరెడ్డిల ఆధ్వర్యంలో
వెంకటయ్య, అనంతయ్య, రాములు, భీములు,
బాలయ్య, శేఖర్, బాల్రాజ్, రమేశ్లతోపాటు 30 మంది, పూడూరు మండలం మంచన్పల్లి గ్రామపంచాయతీ అనుబంధ గ్రామం మాటుగూడెం నుంచి కె.రాంరెడ్డి, సత్యనారాయణల ఆధ్వర్యంలో కిష్టయ్య, రమేశ్, రామయ్య, అంజయ్య, విజయ్బాబులతోపాటు 15 మంది, పూడూరు మండలం కండ్లపల్లి, పోతిరెడ్డిగూడల నుంచి చేవెళ్ల శివకుమార్, పోతుగంటి లింగం, దేవయ్య, పెండా వెంకటయ్య, కిష్టయ్య, సామయ్యలతోపాటు 30 మంది, పరిగికి చెందిన బీజేపీ నాయకుడు నందు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో
చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి నోటా బీఆర్ఎస్ మూడోసారి అధికారం చేపడుతుందని ధీమాగా చెబుతున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.