షాద్నగర్ : కొందుర్గు మండలంలోని చిన్నఎల్కిచర్ల, కొందుర్గు ఎస్సీ కాలనీలకు చెందిన కలీం, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, పోమాల రత్నయ్య, గంట్ల బంటి, రామగల్ల రత్నం, బీమారం కృష్ణయ్య, సామ్యూల్, మఠంగారి సామ్యూల్తో పాటు సుమారు 300 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రూ.400లకే వంట గ్యాస్, రైతు బంఢు ద్వారా ఎకరానికి రూ.16వేలు, ఆరోగ్య బీమా, అన్నపూర్ణ పథకం ద్వారా ఇంటింటికీ సన్నబియ్యం, సౌభాగ్యలక్ష్మి రూ. 3వేల వంటి ఎన్నో సంక్షేమ పథకాలు మనందరికి రానున్నాయని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల మోసపూరితమైన మాటలను నమ్మెద్దని, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించాలని ఎమ్మెల్యే కోరారు.
వికారాబాద్, అక్టోబర్ 25 : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పాలనకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే అనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని కొత్తగడిలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. గ్రామలు, పట్టణాలు అభివృద్ధి చెందాయన్నారు. గత పాలకులు పాలించినా అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు సమన న్యాయం చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, కౌన్సిలర్లు గోపాల్, కృష్ణ, కృష్ణారెడ్డి, పుష్పలతారెడ్డి, సురేశ్, కిరణ్పటేల్, నాయకులు రాజమల్లు, విజయ్కుమార్, మల్లేశం పాల్గొన్నారు.
మర్పల్లి : బీఆర్ఎస్తోనే అన్ని వర్గాల సంక్షేమమని వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన వివిధ పార్టీల నుంచి 40 మంది నాయకులు ఎమ్మెల్యే ఆనంద్ సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీకి చెందిన ప్రశాంత్, కాంగ్రెస్కు చెందిన మాజీ వార్డు సభ్యులు శంకరయ్య, చిన్న, ప్రశాంత్, నర్సింహులు, ప్రభు, సుభాష్, ఇబ్రహీంతో పాటు 40 మంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్గుప్తా, జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి ఉన్నారు.
పరిగి : దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలనందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గోవిందాపూర్ నుంచి 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, చౌడాపూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు దేశమోని లక్ష్మయ్య, ఎస్.రామచంద్రి, పి.వెంకట్రాములు, ఎస్.గోపాల్, ఎస్.నవీన్, జి.గోపాల్, కె.రాములుతోపాటు 70 మంది, చౌడాపూర్ మండలం ఈర్లవాగుతండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు కె.శ్రీనివాస్, జె.గోపాల్, భరత్, బాబు, రవి, రాంచందర్లతోపాటు 90 మంది, మహ్మదాబాద్ మండలం చౌదర్పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు వడ్డె రాజు, కావలి పెద్ద భీమయ్య, రాంజానాయక్, రూప్సింగ్, చారి, వెంకట్నాయక్లతోపాటు 40 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షుడు సమీర్తోపాటు ఆయన అనుచరులు 50 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలపుడే పథకాలు ప్రకటించడం, ఆరు నెలల్లో వాటికి మంగళం పాడడం పక్కనే గల కర్ణాటక రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, కులకచర్ల జడ్పీటీసీ రాందాస్నాయక్ పాల్గొన్నారు.
కొడంగల్ : మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, జాతీయ అవార్డు గ్రహీత, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు ఏరన్పల్లి శ్రీనివాస్ బుధవారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొడంగల్ అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యే కృషికి ఆకర్షితులై తెలంగాణ ఉద్యమకారులు శ్రీనాథ్సింగ్, బాలరాజుగౌడ్, నర్సింహులు, రాజు, శివ ప్రసాద్తో పాటు అన్ని మండలాలకు చెందిన 100 మంది ఉద్యమకారులు, బహుజనులు పార్టీలో చేరినట్లు శ్రీనివాస్ తెలిపారు. పార్టీ పటిష్టతకు కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
కోస్గి : కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందని, బీఆర్ఏస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ నాయకులందరూ బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం కోస్గి మండల కేంద్రంలోని బలభద్రాయపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు టి.కృష్ణారెడ్డి, బాలకృష్ణారెడ్డి, మధుసూదన్రెడ్డి, హనంతు, చెన్నప్ప, జితేందర్, చంద్రయ్య, శ్రీను, ఆనంద్గౌడ్, కిష్టప్ప, కృష్ణానాయక్, మదరప్ప, వెంకటయ్యతోపాటు 70మంది ఎమ్మెల్యే నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
బొంరాస్పేట : మండలంలోని ఎన్నెమీదితండాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు 100 మంది బుధవారం ఎమ్మెల్యే నరేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కార్యకర్తలుకార్యకర్తలు కలిసికట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులున్నారు.