పెద్దఅంబర్పేట, సెప్టెంబర్ 20 : వినాయకుడు విభిన్న రూపాల్లో ఆకట్టుకుంటున్నాడు. పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలో ఇందుకూరి లేక్షోర్ ఆధ్వర్యంలో మొక్కలతో ఏర్పాటు చేసిన గణపతి అందరినీ ఆకర్శిస్తున్నాడు.
నిర్వాహకులు దాదాపు 5 వేల మొక్కలతో 22 ఫీట్ల ఎత్తైన గణేశుడిని తయారు చేశారు. ఈ హరిత గణపతి అటుగా వెళ్లే వాహనదారులను ఆగి మొక్కల ప్రాధాన్యం తెలుసుకునేలా చేస్తున్నాడు. ఈ మొక్కలకు నిత్యం నీళ్లు కూడా పోస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది హరితస్ఫూర్తిని చాటుతున్నది.