రంగారెడ్డి, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. సామాజిక భద్రతలో భాగంగా వారికి సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తున్నది. ఇందుకోసం 2014లో ఆసరా పింఛన్ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లు గీత, చేనేత కార్మికులు, హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా వ్యాధిగ్రస్థులు, డయాలసిస్ రోగులకు ప్రతినెలా పింఛన్ను అందిస్తూ ఆదుకుంటున్నది. గతంలో ఉన్న ‘ఆసరా’ నిబంధనలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. భర్త మృతి చెందిన జీవిత భాగస్వామికి 57 ఏండ్లు నిండితే వృద్ధాప్య పింఛన్.. ఆ లోపు వారికి వితంతు పింఛన్కు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే మంజూరు చేయనున్నది. అంతేకాకుండా అలాంటి వారిని ప్రతినెలా గుర్తించాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
భార్య ఆధార్కార్డుతోపాటు భర్త మరణ ధ్రువీకరణ పత్రా న్ని జత చేసి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే పింఛన్ అందేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది ఆగస్టు నెలలో ప్రభుత్వం అన్ని విభాగాల్లో అర్హులను గుర్తించి కొత్త పింఛన్లను మంజూరు చేసింది. దీంతో పింఛన్లు పొందుతున్న రంగారెడ్డి జిల్లాలోని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా పింఛన్దారులు తమ ఆధార్ నంబర్ ను ఈకేవైసీకి అనుసంధానం చేయించాలని అధికారులు సూచిస్తున్నారు. పింఛన్ పొందుతున్న ఇంటి పెద్ద లేదా భర్త మరణిస్తే ఆయన స్థానంలో భార్యకు ఆసరా/వృద్ధాప్య పింఛన్ను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ‘ఆసరా’ నిబంధనలను మార్చింది. దివ్యాంగులకు రూ.3,016 చొప్పున, ఇతర లబ్ధిదారులకు రూ. 2,016 చొప్పున లక్షలాది కుటుంబాలకు పంపిణీ చేస్తున్నారు.
దరఖాస్తు..ఇలా చేసుకోండి
వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వ్యక్తి మృతి చెందితే అతడి భార్య తన ఆధార్ కార్డుతో పాటు భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తు ఫారానికి జత చేసి గ్రామాల్లో ఉండే పంచాయతీ కార్యదర్శులకు అం దించాలి. పట్టణాల్లో అయితే పురపాలక సంఘం కార్యాలయాల్లోని బిల్ కలెక్టర్లకు అందజేయాలి. దరఖాస్తులను పరిశీలించిన సంబంధిత అధికారులు వాటిని ఆన్లైన్ ద్వారా ఉన్నతాధికారులకు పంపిస్తా రు. ఈ ప్రక్రియ అంతా 15 రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు దరఖాస్తులను పరిశీలిం చి పింఛన్లను మంజూరు చేస్తారు. 57 ఏండ్లు నిం డిన వారికి వృద్ధాప్య, ఆ లోపు ఉన్న వారికి వితంతు పింఛన్ను అందజేస్తారు. ప్రతినెలా ఇలాంటి లబ్ధిదారులను గుర్తించి ఆసరా వెబ్సైట్లో వారి వివరాల ను అప్లోడ్ చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 2,08,639 మంది ..
రంగారెడ్డి జిల్లాలోని 2,08,639 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతినెలా ఆసరా పింఛన్లను పంపిణీ చేస్తున్నది. వారిలో వృద్ధాప్య పింఛన్లు 85,496 మం దికి, వితంతు పింఛన్లు 85,359 మందికి, దివ్యాంగ పింఛన్లు 28,023మందికి, గీత కార్మిక పింఛన్లు 2,395 మందికి, చేనేత పింఛన్లు 838మందికి, బీడి కార్మిక పింఛన్లు 14మందికి, ఒంటరి మహిళలు 6,514మందికి, డయాలసిస్ పేషంట్ల పింఛన్లు 404 మందికి పింఛన్లు అందుతున్నాయి. దివ్యాంగులకు రూ.3,016, మిగతా వా రికి రూ.2,016 చొప్పున ప్రతినెలా అందజేస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.52.84కోట్లను జిల్లాకు కేటాయిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పదిహేను రోజుల్లో పింఛన్ పొందేలా..
ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం ఇబ్బందులకు గురి కావొద్దనే ఉద్దేశంతో ప్ర భుత్వం అతడి భాగస్వామికి పింఛన్ను అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆసరా పథకంలోని నిబంధనలను సడలించింది. అవసరమైన ధ్రువపత్రాలను అధికారులకు అందిస్తే.. వారికి పదిహేను రోజుల్లో పింఛన్ను అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిబంధనలను మార్చింది.
– ప్రభాకర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, రంగారెడ్డి జిల్లా