ముంబై ,జూన్ 18: బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తన లిస్టెడ్ కంపెనీల షేర్లు నష్టపోయాయాడు. ఈ వారం స్టాక్ మార్కెట్స్ నష్టపోవడంతో ప్రపంచ సంపద సూచికలపై అదానీ నికర విలువ బాగా తగ్గింది. రెండు లిస్టెడ్ సంస్థలు పుంజుకున్నా, మరో నాలుగు సంస్థలవ్యాపారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. బిలియనీర్ గౌతమ్ అదానీ ఇకపై ఆసియా రెండవ ధనవంతుడు కాదు. అదానీ గ్రూప్ ఆరు లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ బాగా పడిపోయిన తరువాత నాలుగు రోజులలో 58 ఏండ్ల వ్యాపార వ్యాపారవేత్త అదానీ గౌతమ్ నికర విలువ దాదాపు14 బిలియన్ డాలర్ల మేర పడిపోయింది.
అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పోర్ట్స్ , అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు సోమవారం పడిపోవడం ప్రారంభించాయి. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల సంపదను గుర్తించే ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా ప్రకారం అదానీ నికర విలువ 62.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. వారం ప్రారంభంలో అదానీ నికర విలువ 77 బిలియన్ డాలర్లు ఉన్నది. అదానీ కంపెనీల షేర్ల పెరుగుదలను చూసి ఆయన ఆసియాలోనే అత్యంత ధనవంతుడు అవుతాడని చాలామంది నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడుపరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఊహాగానాలను నమ్మవద్దు…
అదానీ గ్రూప్ వాటాదారులను ఊహాగానాలను నమ్మవద్దని సంస్థకు చెందిన విశ్లేషకులు కోరారు. రాబోయే కొద్ది రోజులలో జాగ్రత్తగా ఉండాలని ఖ్యంగా అదానీ గ్రూప్ సంస్థలలోని వాటాదారులను భయాందోళనలకు గురికావద్దని వారు తెలిపారు. పోర్ట్-టు-పవర్ ప్రధాన సంస్థ దానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు సానుకూలంగా ట్రేడ్ అయ్యి ,మధ్యాహ్నం 1:30 గంటలకు దాదాపు 5 శాతం పెరిగింది. అంబానీ పోర్ట్స్ షేర్లు కూడా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో 5 శాతానికి పైగా పెరిగాయి.అయినప్పటికీ, సంస్థ కుచెందిన ఇతర లిస్టెడ్ కంపెనీలు ఇప్పటికీ నష్టాల్లోనే ఉన్నాయి. అదానీ ట్రాన్స్మిషన్, పవర్ ,టోటల్ గ్యాస్ ఇప్పటికీ 5 శాతంఉండగా అదానీ గ్రీన్ ఎనర్జీ దాదాపు 4 శాతం తగ్గింది.