ఎలిమినేడు భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
ఎమ్మెల్యే సహకారంతో పరిహారం అందిస్తాం
వైస్ఎంపీపీ వెంకటప్రతాప్రెడ్డి, సర్పంచ్ అశోక్వర్ధన్రెడ్డి
ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 18 : ఎలిమినేడులో ఎరోస్పేస్కు భూములు కేటాయించిన స్థలంలో ఎలాంటి అవకతవకలు జరుగలేదని ఇబ్రహీంపట్నం వైస్ఎంపీపీ మంచిరెడ్డి వెంకటప్రతాప్రెడ్డి, ఎలిమినేడు సర్పంచ్ అశోక్వర్ధన్రెడ్డి అన్నారు. మంగళవారం ఎలిమినేడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎరోస్పేస్ నిర్మాణం జరిగే ప్రాంతంలో సర్వేనంబర్ల 512, 166, 472, 421లో భూములు కోల్పోయిన వారికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సహకారంతో ఇప్పటికే పరిహారం కూడా అందించినట్లు తెలిపారు. భూములు అందజేసిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందించేలా ఎమ్మెల్యే కృషిచేస్తున్నారని, ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వెంటనే అందిస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు అసత్య ఆరోపణలు చేయటం సరైన పద్ధతి కాదన్నారు. ఉన్న భూములకు రికార్డు ప్రకారం పరిహారం ప్రభుత్వం ఇప్పటికే అందజేసిందని పేర్కొన్నారు. ప్రతిపక్షపార్టీల నాయకులు ఎమ్మెల్యే, ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని, వెంటనే అసత్య ఆరోపణలు మానుకోవాలని వారు హెచ్చరించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ప్రాంతం అభివృద్ధిలో పరుగులు తీస్తున్నదన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు బుట్టి నర్సింహ, బుట్టి రాములు, బుట్టి బుగ్గరాములు, మహేందర్ పాల్గొన్నారు.