పురోగతిలో 5 చెక్ డ్యాంలు మరో 6 చెక్ డ్యాంలకు పరిపాలన
ఆమోదం కోసం ప్రతిపాదనలు
ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
తాండూరు రూరల్ , జనవరి 18 : నియోజకర్గంలోని కాగ్నా వాగుపై 11 చెక్ డ్యాంలను నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు శాఖల అధికారులతొ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి సహకారంతో పెద్దేముల్ మండలం మన్సాన్పల్లి నుంచి కర్ణాటక శివారులోని క్యాద్గిరా వరకు 11 చెక్ డ్యాంలను కాగ్నా వాగుపై నిర్మించాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం 5 చెక్ డ్యాంల పనులు పురోగతిలో ఉన్నాయని, మరో 6 చెక్ డ్యాంల నిర్మాణాల కోసం పరిపాలన ఆమోదంలో ఉన్నాయన్నారు. ఈ చెక్ డ్యాంలు పూర్తయితో కాగ్నా ఆయకట్టు రైతులకు సాగు విస్తీర్ణం పెరుగుతుందన్నారు.భూగర్భజాలలు కూడా సమృద్ధిచెందుతాయన్నారు. సంబంధిత కాంట్రాక్టర్లతో ఫోన్లో మాట్లాడుతూ గడువులోగా పనులన్నీ పూర్తి చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే అధికారులతోపాటు కాంట్రాక్టర్లపై చర్యలుంటాయని హెచ్చరించారు. కోటపల్లి కుడి, ఎడమ కాలువల ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శివసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులకు కొంతమందికి తప్పా అందరికీ నష్టపరిహారం ప్రభుత్వం అందిందన్నారు. త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.