నియోజకవర్గంలో కుండపోత వర్షం l అబ్దుల్లాపూర్మెట్, పెద్దఅంబర్పేట్ను ముంచెత్తిన వరద
ఇబ్రహీంపట్నం, జూలై 15 : అల్పపీడనం ప్రభావంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లోని గ్రామా ల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అబ్దుల్లాపూర్మెట్ మండలంతో పాటు పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీలో భారీ వర్షపాతం నమోదైంది. దీంతో కోహెడ, తొర్రూరు, విజయవాడ హైవేతో పాటు బాటసింగారం రోడ్డులో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీలో పలు కాలనీలు జలమయమయ్యాయి.
నీట మునిగిన పంటలు
మంచాల, జూలై 15 : అల్పపీడన ప్రభావంతో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి 60 ఎకరాల్లో వరితో పాటు ఇతర పంటలు నీటమునిగాయని వ్యవసాయ శాఖ అధికారి జ్యోతిశ్రీ అన్నారు. మండల పరిధిలోని బోడకొండ, ఎల్లమ్మతండా, కొర్రవాని తండా, సత్తితండా గ్రామాల్లో నీట మునిగిన వరి పంటతో పాటు ఇతర పంటలను గురువారం ఎంపీపీ నర్మద, జడ్పీటీసీ నిత్య, వైస్ ఎంపీపీ రాజేశ్వరి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ… పొలాల్లో నీరు వెళ్లిన తర్వాత వరి కుళ్లి పోకుండా స్ప్రింట్ కార్బండిజం, మానోకోజబ్ ఎకరానికి 500 గ్రాములు నీటిలో కలిపి పిచికారీ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో లోయపల్లి, సత్తితండా సర్పంచ్లు అనిత, పెంటయ్య నాయక్, ఏఈవో నిఖిత, లింగస్వామి పాల్గొన్నారు.
మున్సిపాలిటీ అతలాకుతలం
పెద్దఅంబర్పేట, జూలై 15 : గత రాత్రి కురిసిన వర్షానికి మున్సిపాలిటీలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. రోడ్ల వెంట నీరు వరదలాగా పారింది. పలు ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. కల్వంచలో వరద నీరు ఎక్కువగా రావడంతో ఇండ్లలోకి నీరు చేరింది. కళానగర్లో భారీగా వరద నీరు చేరింది. భూధాన్ జయప్రకాశ్ కాలనీలోకి వరద నీరు భారీగా చేరడంతో జనజీవనం స్థంభించింది. కల్వంచలో కౌన్సిలర్లు మల్రెడ్డి దీపిక, అనూష మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, జీహెచ్ఎంసీ అధికారులు, కమిషనర్ ఖమర్కు పరిస్థితిని వివరించారు. భూధాన్లో చైర్పర్సన్ స్థానికులను పిరిస్థితులను ఆరా తీశారు.