షాబాద్, మార్చి 1 : బుధవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 15,694 మందికి కంటి పరీక్షలు నిర్వహించిన్నట్లు వైద్యరోగ్యశాఖ అధికారులు తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 15,694 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 15,694 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 1,416 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1,160 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
బొంరాస్పేట : నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చినవారికి వికారాబాద్ జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. 5530 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. వీరిలో 882 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 819 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 170 గ్రామాలు, 39 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు.
కొత్తూరు : ప్రతిరోజూ 200 మందికి కంటి పరీక్షలు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో విజయలక్ష్మి సూచించారు. కొత్తూరు పీహెచ్సీ ఆధ్వర్యంలో మండలంలోని కొడిచెర్లలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని ఆమె బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. డాక్టర్లను వివరాలడిగి తెలుసుకున్నారు. అనంతరం పరీక్షలు చేయించుకొని వెళ్తున్న లాలూనాయక్ అనే వ్యక్తితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వైద్యం గురించి వాకబు చేశారు. కార్యక్రమంలో డా.కార్తీక్, ఎంపీహెచ్వో చిట్టిబాబు, సూపర్వైజర్వ్రి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఉన్నారు.
– బి.కిష్టయ్య, తల్లారం,చేవెళ్ల మండలం
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు మంచి కార్యక్రమం. మాలాంటి పేదలు వేరే చోటుకు వెళ్లకుండా ఊర్లోనే పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇస్తున్నారు. ఇది వరకు పరీక్షలు చేసుకోవాలంటే దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు. నేరుగా ఊర్లోనే కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేసి మందులు ఇస్తుండ్రు. నాకు పరీక్షలు చేసి మందులు, అద్దాలు ఇచ్చిండ్రు.