రైతుబంధుతో రైతు మొహంలో ఆనందం
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
మండల కేంద్రంలో ట్రాక్టర్ల ర్యాలీ
మొయినాబాద్, జనవరి 14 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు సంబరాలు అంబరాన్నంటాయి. డప్పులు దరువులు.. డీజే పాటల హోరులో ట్రాక్టర్ ర్యాలీ కొనసాగింది. శుక్రవారం మొయినాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు గునుగుర్తి జయవంత్, ఎంఏ రావూఫ్, మాజీ జడ్పీటీసీ అనంతరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు సంబురాలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల కేంద్రంలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై సుమారుగా అర కిటోమీటర్ పొడవున ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీ ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి జైతెలంగాణ నినాదాలు చేశారు. అదే విధంగా మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుబంధు ప్రవేశపెట్టిన తర్వాత పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. రైతుల అండ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పుష్కలంగా ఉందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ డప్పు రాజు, డైరెక్టర్ అంజనేయులుగౌడ్, వైస్ ఎంపీపీ మమత, టీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నర్సింహ, సర్పంచ్లు రాజు, శ్రీనివాస్, రత్నం, ఎంపీటీసీ మల్లేశ్, టీఆర్ఎస్ నాయకులు మహబూబ్, దారెడ్డి వెంకట్రెడ్డి, పరమేశ్, ఆండ్రూ, రాజు, హరిశంకర్, మల్లేశ్ పాల్గొన్నారు.