అభివృద్ధిలో దూసుకుపోతున్న ఇనాంగూడ
రూ. కోటి 34 లక్షలతో పనులు మారిన రూపురేఖలు
అబ్దుల్లాపూర్మెట్, జనవరి 14: అబ్దుల్లాపూర్మెట్ మండలంలో ఇనాంగూడ నూతనం గా ఏర్పడిన పంచాయతీ. భౌగోళికంగా ఈ గ్రామం చాలా చిన్నది. గతంలో లష్కర్గూడ గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో గడిచిన రెండేండ్లలో గ్రామంలో రూ. కోటి 34లక్షలతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామంలో ప్రతీ రోజు రోడ్లను శుభ్రం చేయడంతో పాటు పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించి డంపింగ్యార్డుకు తరలించి కం పోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు. హరిత హా రంలో రోడ్లకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీటిని అందజేస్తున్నారు. రూ. 22లక్షల ఎన్జీఎస్, రూ.19లక్షల మండలపరిషత్, రూ.8లక్షలు జడ్పీ నిధులతో యశోదనగర్లో సీసీ రోడ్లు, ఎమ్మెల్యే, పంచాయతీ నిధులు రూ. 10లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రూ. 34లక్షలతో మిషన్భగీరథ ట్యాంకుల నిర్మాణం, రూ. 12లక్షలతో పైపులైన్ పనులు, దాతల సహాయంతో సమకూరిన రూ. 5లక్షలతో గ్రామంలోని ప్రధాన వీధు ల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, రూ. మూడు లక్షలతో ఇంటింటికి నల్లా కనెక్షన్ పనులు చేపట్టారు. రూ. మూడులక్షలతో గౌడ సంఘ భవన నిర్మాణం, రూ. మూడులక్షలతో వంశరాజ్ సంఘ భవన నిర్మాణం, రూ. మూడులక్షలతో కమ్యూనిటీహాల్ భవన నిర్మాణ పను లు జరుగుతున్నాయి. విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు అమర్చి కొత్త వెలుగులు అందిస్తున్నారు. గ్రామంలోని సర్వేనంబరు 51లో పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేశారు. అందులో రాగి, ఉసి రి, గోరింటాకు, చింత, మందార, దాని మ్మ, కానుగ, నేరేడు, టేకు, గన్నెరు వంటి మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. నర్సరీలో విత్తనాలు పెట్టి మొలకెత్తిన మొక్కలను గ్రా మంలోని ఖాళీ స్థలాలు, వైకుంఠధా మం, రోడ్లకు ఇరువైపులా నాటారు. వాటికి నీరు అందిస్తున్నారు.