పెద్దేముల్, జూలై 20 : టీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మన్సాన్పల్లి, మారేపల్లి తండా, దుగ్గా పూర్, చైతన్యనగర్, జనగాం,గాజీపూర్ గ్రామాల్లో పలు రకా ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. జనగాం గ్రామంలో దస్తగీర్ పీర్లకు పూజలు నిర్వహించారు. డీఎంఎఫ్టీ నిధులతో మండలంలో డిమన్సాన్పల్లిలో రూ. ఐదు లక్షల సీసీ రోడ్డు, మారేపల్లి తండాలో రూ. ఐదు లక్షల సీసీ రోడ్డు, దుగ్గాపూర్లో రూ. మూడు లక్షల మురుగుకాల్వ, రూ. నాలుగు లక్షల సీసీ రోడ్డు,చైతన్య నగర్లో రూ.ఐదు లక్షలతో సీసీ రోడ్డు, రూ.నాలుగు లక్షలతో మురుగుకాల్వ, జనగాంలో రూ.7 లక్షల సీసీ రోడ్డు, గాజీపూర్లో రూ.16 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం నిర్మా ణం,రూ.ఆరు లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలో వచ్చాక సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ టి.అనురాధ, వైస్ ఎంపీపీ మధులత, జడ్పీటీసీ ధారాసింగ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు టి.రమేశ్ ,ముకుంద్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు శ్రావణ్ కుమార్, రుక్కి బాయి, పాండు, పాషా, లలిత, రుక్మిణమ్మ, తలారి వీరప్ప, ఎంపీటీసీలు వెంకటేశ్చారి, స్వప్న, సీతాబాయి, నాయకులు రాజు, లక్ష్మణ్నాయక్, రవి నాయక్, మహిపాల్ రెడ్డి, సంగమేశ్వర్ పాల్గొన్నారు.
42 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం పేదింటి ఆడపడుచులకు ఓ వరంలా మారిందని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరి షత్ కార్యాలయ సమావేశ మందిరంలో సుమారు 42 మంది లబ్ధిదారులకు రూ.42,04,872 విలువగల చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు.