వికారాబాద్ జిల్లాలో 969 ప్రధాన, 138 మినీ అంగన్వాడీలు కలుపుకొని మొత్తం 1107 కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఏడు నెలల నుంచి మూడేండ్లలోపు చిన్నారులు 33,600 మంది ఉండగా, 3 నుంచి 6 ఏండ్లలోపు పిల్లలు 22400 మంది ఉన్నారు. గర్భవతులు, బాలింతలు 11800 ఉన్నారు. వీరికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా రాష్ట్ర సర్కార్ పౌష్టికాహారాన్ని అందజేస్తున్నది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో రేపటి నుంచి వారం రోజులపాటు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. తల్లులు, గర్భిణులను పిలిపించి వారికి తల్లిపాల ప్రాముఖ్యతను వివరించనున్నారు. తల్లిపాలే బిడ్డకు అమృతంతో సమానమని, బిడ్డ సంపూర్ణ ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలన్నీ తల్లిపాలలో ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
– బొంరాస్పేట, జూలై 30
బొంరాస్పేట, జూలై 30 : తల్లి పాల ప్రాధాన్యాన్ని మహిళలకు వివరించేందుకు ప్రభు త్వం ప్రతి ఏడాది ఆగస్టు 1నుంచి 7వ తేదీ వరకు తల్లి పాల వారోత్సవాలను నిర్వహిస్తున్నది. సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ(ఐసీడీఎస్) ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో దీనిపై వారం రోజులపాటు ప్రత్యే క కార్యక్రమాలు నిర్వహించి గర్భిణులు, బాలింతలకు తల్లి పాల విశిష్టతను వివరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రసవమైన వెంటనే పుట్టిన బిడ్డకు తల్లిపాల(ముర్రుపాలు)ను ఇవ్వరు. దీనిపై ప్రజల్లో అనేక అపోహలున్నాయి. ఆ తర్వాత కూడా తల్లిపాలను ఇవ్వడం తగ్గించి మార్కెట్లో లభించే డబ్బాపాలను పడుతుంటారు. దీని ఫలితం గా పుట్టిన బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత రోగనిరోధక శక్తి సరిగ్గా లేక అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది. తల్లి పాలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి పుట్టి న వెంటనే బిడ్డకు తల్లిపాలు ఇచ్చేలా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకే ప్రభుత్వం తల్లిపాల వారోత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నది.
పోషకాలు అధికం..
ప్రస్తుతం దేశంలోని పిల్లలకు నిర్దేశించిన స్థాయిలో తల్లిపాలు అందడం లేదు. పుట్టిన గంటలో కేవలం 41శాతం మంది మాత్రమే పిల్లలకు తల్లిపాలు ఇస్తున్నారు. దీనివల్ల పిల్లలకు భవిష్యత్తులో అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఒక అధ్యయనంలో తేలింది. అందుకే తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. బిడ్డ సంపూర్ణ ఆరోగ్యానికి కావాల్సిన అన్ని రకాల పోషక విలువలు తల్లి పాలలో ఉంటాయి. తల్లి జన్మనిచ్చిన గంటలోపే బిడ్డకు ముర్రుపాలు ఇవ్వాలి. ఆ పాల తో చిన్నారుల్లో రోగ నిరోధకశక్తి పెరుగుతుం ది. పిల్లలకు ఐదేండ్ల లోపు వచ్చే డయేరి యా, వైరల్ జ్వరాలు, కామెర్లు వంటి వాటి నుంచి తల్లిపాలు రక్షిస్తాయి. అదేవిధంగా పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, అల ర్జీ, డయాబెటిస్ క్యాన్సర్, ఊబకాయం తదితర వ్యాధులు రాకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లల మానసిక పెరుగుదలకూ తల్లిపాలు ఎంతో దోహదం చేయడమే కాకుండా బరువును అదుపులో ఉంచుతాయి. పుట్టిన ఆరు నెలల వరకు బిడ్డ కు తల్లిపాలను ఇవ్వాలని సూచిస్తున్నారు.
తల్లీబిడ్డలూ ఉంటారు..
బిడ్డకు తల్లి పాలను ఇవ్వడం వల్ల బిడ్డతోపాటు తల్లి ఆరోగ్యం కూడా మంచిగా ఉం టుంది. తల్లి పాలను బిడ్డకు ఇవ్వడం ద్వారా తల్లీబిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుం ది. ప్రసవం తర్వాత మహిళలు సాధారణం గా నెల రోజుల వరకు రక్తస్రావంతో బాధపడుతుంటారు. తల్లిపాలను బిడ్డకు ఇవ్వడం వల్ల దీనిని నివారించొచ్చు. ఇటీవలికాలం లో మహిళలు రొమ్ము, అండాశయ క్యాన్సర్లతో బాధపడుతున్నారు. వీటికి ఒక కార ణం తల్లులు బిడ్డకు పాలివ్వకపోవడమేనని ఓ అధ్యయనంలో తేలింది. ఈ వ్యాధుల బా రిన పడిన వారిపై నిర్వహించిన పలు సర్వే ల్లో ఎక్కువ మంది తల్లిపాలు బిడ్డకు ఇవ్వని వారేనని ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
జిల్లాలో 1,107 అంగన్వాడీ కేంద్రాల్లో..
వికారాబాద్ జిల్లాలో 969 ప్రధాన, 138 మినీ అంగన్వాడీ కేంద్రాలను కలుపుకొని మొత్తం 1,107 కేంద్రాలున్నాయి. వీటిలో ఏడు నెలల నుంచి మూడేండ్లలోపు పిల్లలు 33,600 మంది, 3 నుంచి 6 ఏండ్ల లోపు వారు 22400 మంది ఉన్నారు. గర్భిణులు, బాలింతలు 11800 ఉన్నారు. వీరికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. కేంద్రాల పరిధిలో వారం రోజులపాటు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించేందుకు ఆయా కేంద్రాల టీచర్లు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.
తల్లి పాల ప్రాముఖ్యంపై వివరిస్తాం
తల్లి పాల ప్రాధాన్యంపై జిల్లాలో వారం రోజుల పాటు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు గ్రామ పంచాయతీ, మండల, బ్లాక్, జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లో మహిళలకు తల్లిపాల ప్రాముఖ్యంపై అవగాహన కల్పిస్తాం. ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలనూ వివరిస్తాం.
-లలితకుమారి, వికారాబాద్ జిల్లా సంక్షేమ అధికారి