రంగారెడ్డి, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : పదోతరగతిలో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గతేడాది కంటే ఈ ఏట మెరుగైన ఫలితాలను సాధించేలా పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈనెల 18 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఉపాధ్యా యులు విద్యార్థులను పూర్తి సన్నద్ధం చేశారు. ఈసారి గతానికి భిన్నంగా ఫలి తాలొస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జ రిగేలా ఇప్పటినుంచే అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
తొలిమెట్టులోనే తడబాటు..
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తొలిమెట్టులాంటి పదోతరగతి పరీక్షల ఫలి తాల్లో రంగారెడ్డి జిల్లా తడబడుతున్నది. 2015-2019 వరకు ప్రతి ఏటా ఉత్తీర్ణ తా శాతం పెరుగుతూ వచ్చింది. మధ్యలో కరోనా రావడంతో 2020, 2021 సంవత్సరాల్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులందరినీ పాస్ చేసింది. ఆ తర్వాత 2022 సంవత్సరంలో 90.04 ఉత్తీర్ణతా శాతాన్ని జిల్లా సాధించగా.. 2023లో ఉత్తీర్ణతా శాతం 86.97 శాతానికి తగ్గింది. ఈసారి ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేసినా నవంబర్, డిసెంబర్ నెలల్లో శాసన సభ ఎన్నికల హడావుడి కొనసాగింది. మెరుగైన ఫలితాల సాధన ఉపాధ్యాయులకు సవాల్గా మారింది. ఈసారైనా మెరుగైన ఫలితాలు వస్తాయా? లేదా! అని తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొన్నది.
సెప్టెంబర్ నుంచే ప్రత్యేక తరగతులు..
వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా.. గతేడాది సెప్టెంబర్ నుంచే విద్యాశాఖ విద్యా ర్థులకు ప్రత్యేక తరగతులను ప్రారంభించింది. తొలుత ఉదయం వేళల్లో తరగ తులు నిర్వహించగా.. జనవరి నుంచి రెండు పూటలా స్పెషల్ క్లాసులు జరిగా యి. వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపారు. సబ్జె క్టుల వారీగా ఉపాధ్యాయులతో స్టూడెంట్లకు ఉన్న సందేహాలను నివృత్తి చేయించా రు. ముఖ్యంగా విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్స్, రోజువారీ టెస్టులు నిర్వహించి మెరుగైన స్థాయికి ఎదిగేలా కృషి చేశారు. స్లిప్ టెస్టులు, ప్రి ఫైనల్ పరీక్షలనూ నిర్వహించారు. ఈ చర్యలతో ఈసారి గతం కంటే మెరుగైన ఫలితాలు వస్తా యన్న ఆశాభావంతో జిల్లా విద్యాశాఖ ఉన్నది.
పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు..
10వ తరగతి పరీక్షలను జిల్లాలో సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖ ల అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో 237 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలకు 50,946 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రశ్నా పత్రాలను 37 పోలీస్ స్టేషన్లలో భద్రపర్చారు. పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్ల నియామకం పూర్తికాగా.. పరీక్షల పర్యవేక్షణ కోసం చీఫ్ సూపరింటెండెంట్లు, మాస్ కాపీయింగ్ జరుగకుండా ఫ్లెయింగ్ స్కాడ్, సిట్టింగ్ స్కాడ్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్లు, ఫ్యాన్లు వంటి వసతులు కల్పిస్తున్నారు. ప్రతి కేంద్రం వద్ద ఏఎన్ఎం, ఆశ వర్కర్ల తోపాటు అత్యవసర మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. బందోబస్తును సైతం ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు గంట ముందే విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈసారి మెరుగైన ఫలితాలొస్తాయి
వంద రోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేశాం. ప్రత్యేక తరగతులను నిర్వహించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. స్పెషల్ క్లాసుల్లో విద్యార్థుల సందేహాలను టీచర్లు నివృత్తి చేశారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు టెస్టులు నిర్వమించాం. ఈ ఏడాది గతం కంటే మెరుగైన ఫలితాలొస్తాయి.
-సుశీందర్రావు, రంగారెడ్డి డీఈవో