తాండూరు, జూలై 18 : స్వదేశీ వస్తువులను ప్రజలందరూ ఆదరించాలని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని షావుకారుపేట్ ఆర్యవైశ్య కల్యాణ మంటపంలో చేనేత హస్తకళ ప్రదర్శన, అమ్మకాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మాట్లాడుతూ.. చేనేత కార్మికులు స్వయంగా తయారు చేసే వస్తువులు కంటికి ఇంపుగా, నాణ్యమైనవిగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు చేతివృత్తి పనులను ప్రోత్సహించాలన్నారు. చేనేత హస్తకళ నిర్వాహకులు, గ్రామీణ వీవర్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు రంగస్వామి మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ర్టాల వస్తువులు, వస్ర్తాలు క్రాఫ్ట్ మేళాలో అమ్మకాలకు ఉంచినట్లు తెలిపారు. పోచంపల్లి, మంగళగిరి, ఉప్పాడ, ధర్మవరం చీరలతో పాటు యువతకు ప్రత్యేక డ్రెస్ మెటీరియల్, హ్యాండీక్రాఫ్ట్ వస్తువులు, కొండపల్లి బొమ్మలు, బ్లాక్ మెటల్, నైట్ మెటల్ వస్తువులు కూడా అమ్మకానికి ఉంచామని పేర్కొన్నారు. ప్రదర్శన, అమ్మకాలను ఈ నెల 29 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్ నీరజ ఉన్నారు.