ఇబ్రహీంపట్నం, జులై 23: రాష్ట్ర, మున్సిపల్శాఖ మంత్రి తారకరామారావు జన్మదినం సంద ర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తులేకలాన్-గున్గల్ అటవీ ప్రాంతం లో లక్ష మొక్కలు నాటే స్థలాన్ని ఫారెస్ట్ రేంజ్ అధికారి విష్ణువర్దన్, మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమాణారెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి సబితా ఇం దారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డికిషన్రెడ్డి, కలెక్టర్ అమయ్కకుమార్, అడిషనల్ డీజీపీ బి శివధర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్భగవత్, డీఎఫ్వో జానకీరాం ముఖ్యఅతిథులుగా హాజరవుతారని వారు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే మొక్కలు నాటే కార్యక్ర మా నికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదగిరి, ఎంపీటీసీ నాగమణి, సింగిల్ విండో వైస్చైర్మన్ సామ రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ బాసాని రాజిరెడ్డి, జేర్కోని రాజు, చెణమోని నరసింహ, పంబలి నగేష్ పాల్గొన్నారు.
ముక్కోటి వృక్షార్చన విజయవంతం చేయాలి
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మం త్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వ ర్యంలో చేపట్టిన ము క్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో పిలు పు నిచ్చా రు. షాద్నగర్లో శనివారం ఉదయం 10గంటలకు నిర్వహించే ము క్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్క రూ పాల్గొని కనీసం మూడు మొక్కలను నాటాలన్నారు. నాటే ప్రతి మొక్క భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతాయనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు.
షాద్నగర్లో ఏర్పాట్లు పూర్తి
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా షాద్నగర్ మున్సిపాలిటీలో ని ఐదో వార్డు సోలీపూర్ గ్రామ సమీపంలో, మున్సి పాలిటీలో శనివారం 2వేల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన ట్లు శుక్రవారం మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొ క్కలు నాటాలన్నారు. సకల జీవకోటికి ప్రాణాధారం మొ క్కలనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ హాజరుకానున్నారని తెలిపారు. ము క్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
నేడు నిర్వహించే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొత్తూరు ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి తెలిపారు. మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తు న పాల్గొని ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి కార్యక్రమా న్ని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్కు పుట్టిన రోజు సందర్భంగా హరిత తెలంగాణను బహుమతిగా అందచేయాలని తెలిపారు.