షాద్నగర్, నవంబర్ 12 : ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంపై ఉన్న సోయి రైతుల శ్రేయస్సుపై ఎందుకు లేదని కేంద్ర సర్కార్పై ఎంపీ మన్నె శ్రీనివాస్రెడి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులను బలోపేతం చేసే విధంగా వ్యవసాయ చట్టాలను మోదీ రూపొందించారన్నారు. రైతులను ఇబ్బందుల గురి చేసిన ఏ ప్రభుత్వమైనా నిలిచినట్లు చరిత్రలో లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నిర్మించిన ప్రాజెక్టుల ఫలితంగా తెలంగాణ రైతాంగం పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలో నిర్వహించిన టీఆర్ఎస్ రైతు మహాధర్నాలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కలిసి పాల్గొని మాట్లాడారు. వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీ నాయకులు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్ర ప్రభుత్వ పనితీరును ఎండగడుతామన్నారు. పంజాబ్లో కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయదో చెప్పాలని ప్రశ్నించారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి, కిష్టయ్య, జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీటీసీలు వెంకట్రాంరెడ్డి, విశాల, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు.
అభివృద్ధి చూసి కండ్లు మండుతున్నాయ్
ఏడేండ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధి చూసి బీజేపీకి కండ్లు మండుతున్నాయని, కొత్త రూల్స్తో రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్నదని ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. చేవెళ్లలో ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించి కేంద్రం రైతు వ్యతిరేక విధానాలపై నినదించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. వానకాలం పంట కొనుగోలు చేస్తున్న కేంద్రం యాసంగి పంటను కొనేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నదో చెప్పాలన్నారు. యాసంగి ధాన్యం కొంటదా? లేదా? ఏదో ఒకటి చెప్పాలన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఒక మాట, రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఒక మాట చెబుతున్నారన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న బీజేపీకి గుణపాఠం చెబుతామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలతో అన్నదాతలకు సర్కార్ అండగా నిలుస్తున్నదన్నారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, ఆయా మండలాల ఎంపీపీలు విజయలక్ష్మి, ప్రశాంతిరెడ్డి, గోవర్దన్రెడ్డి, నక్షత్రం, భవానీ, జడ్పీటీసీలు అవినాశ్రెడ్డి, మాలతి, శ్రీకాంత్, జయమ్మ, గోవిందమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మార్కెట్ చైర్మన్ శివనీల, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్, నర్సింగ్రావు, మహేందర్రెడ్డి, గోపాల్, నాగిరెడ్డి, వాసుదేవ్కన్నా, జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్నసతీశ్, వైస్ ఎంపీపీ శివప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు బాల్రాజ్, పోలీసు రాంరెడ్డి, చల్లా శేఖర్రెడ్డి, చిట్టెపు మల్లారెడ్డి, నక్క శ్రీనివాస్గౌడ్, వనం లక్ష్మికాంత్రెడ్డి, కృష్ణారెడ్డి, మధుసూదన్రెడ్డి, రమణారెడ్డి, మాణిక్యరెడ్డి, ప్రభాకర్, శ్రీరాంరెడ్డి, మల్లేశ్, కృష్ణగౌడ్, రంగారెడ్డి, సతీశ్రెడ్డి, సయ్యద్ మునీర్, కారు చెన్నయ్య, రవి, రాజేందర్రెడ్డి, మల్లారెడ్డి, రమేశ్యాదవ్, దర్శన్, అవిలాశ్గౌడ్, శేఖర్, నర్సింహారెడ్డి, జయవంత్, ప్రవీణ్కుమార్, ఇబ్రహీం, గణేశ్గౌడ్, సుధాకర్గౌడ్, దయాకర్చారీ, ఇనాయత్, నర్సింహులు పాల్గొన్నారు.