రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్ ఉమ్మడి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల ప్రశంసలను అందుకొంటున్నది. రూ.2,90,396 కోట్లతో రూపొందించిన బడ్జెట్ అన్ని రంగాలకు సమన్యాయం చేసేలా ఉన్నదని పలువురు పేర్కొంటున్నారు. ఈ పద్దుతో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరుగు పెట్టనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటిలాగే రైతు అభ్యున్నతే ధ్యేయంగా సాగునీరు, ఉచిత విద్యుత్, రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను కొనసాగించేలా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. దీంతోపాటు డబుల్బెడ్రూం ఇండ్లు, దళితబంధు, మన ఊరు-మన బడి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు చేసింది.
సొంతజాగలో ఇండ్లు కట్టుకునే పేదలకు ఆర్థికసాయం చేసేందుకు నిధులు కేటాయించగా, వికారాబాద్ జిల్లాలో 6వేల మంది పేదలకు మేలు జరుగనున్నది. అదేవిధంగా జిల్లాలో దాదాపు రూ.130 కోట్ల రుణ మాఫీ చేయనుండగా, 45 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాకు సాగునీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తైతే వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల ఎకరాలకు సాగు నీరందనున్నది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త ఆరోగ్య పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. దీంతో జిల్లాలోని సుమారు 12 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణతో 180 మందికి, సెర్ప్ ఉద్యోగులకు పీఆర్సీతో 186 మందికి మేలు జరుగనున్నది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అలాగే రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైల్ సేవల పనులకు కోసం భారీగా నిధులు కేటాయించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
వికారాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చింది. అన్ని రంగాలకు కేటా యింపులు చేసింది. ప్రతి బడ్జెట్ మాదిరిగానే ఈ బడ్జెట్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాని కి అధిక ప్రాధాన్యతనిచ్చింది. వ్యవసాయ రంగంతోపాటు సంక్షేమ, సాగునీటి రంగాలకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది. అంతేకాకుం డా రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, దళితబంధు, మన ఊరు-మన బడి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ న్యూ ట్రిషన్ కిట్స్, ఆరోగ్యశ్రీ, తెలంగాణకు హరితహా రం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులను కేటాయింపులు చేసింది. జిల్లాతోపాటు మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ, నాగర్కర్నూల్ జిల్లాలకు సాగునీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 60 శాతం పూర్తయ్యాయని.. త్వరలోనే పర్యావరణ అనుమతు లు పొంది పూర్తి చేస్తామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈపథకం పూర్తైతే జిల్లాలోని సు మారు 3 లక్షల ఎకరాలకు సాగు నీరందనున్నది. అదేవిధంగా పల్లెప్రగ తి, పట్టణ ప్రగతితోపాటు ఫైనాన్స్ కమిషన్ నిధులను నేరుగా స్థానిక సంస్థ ల ఖాతాల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది.
అన్ని రంగాల అభివృద్ధికి బాటలు వేసేలా బడ్జెట్ ఉన్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ కలల సాకార బడ్జెట్ అని కొనియాడారు. గ్రామాలు, పట్టణాల గతినే మార్చుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు రూ.5,609 కోట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లకు రూ.3,210 కోట్లు కేటాయింపు గొప్ప విషయమన్నారు. ఈ బడ్జెట్లో తాను నిర్వహిస్తున్న విద్యా రంగానికి రూ.19,093 కోట్ల నిధులను కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. విశ్వ విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.500 కోట్లు, మహిళ, అటవీ యూనివర్సిటీలకు రూ.100 కోట్ల నిధుల కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజామోద బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు విద్యాశాఖ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఇల్లులేని వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సొంత స్థలముండి ఇల్లు లేని వారు ఇంటిని నిర్మించుకుంటే రూ.మూడు లక్షల చొప్పున ఆర్థి క సాయం అందించాలని నిర్ణయించింది. అయి తే ఒక్కో నియోజకవర్గంలో రెండు వేల మందికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో సుమా రు ఆరు వేలమంది పేదలకు ప్రయోజనం కలుగనున్నది. అదేవిధంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం నిధులను కేటాయించింది. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, చేవెళ్ల నియోజకవర్గాలకు 3,873 డబు ల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా పరిగి మం డలానికి 480 ఇండ్లు, చేవెళ్ల నియోజకవర్గంలో 258 ఇండ్లు, కొడంగల్ నియోజకవర్గంలో 394 ఇండ్లు, తాండూరు నియోజకవర్గానికి 1,740 ఇండ్లు, వికారాబాద్ మున్సిపాలిటీకి 401 ఇం డ్లు, వికారాబాద్ నియోజకవర్గానికి 600 ఇండ్లు మంజూరయ్యాయి. అందులో ఇప్పటివరకు 1,200 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా మిగతా ఇండ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు, రుణమాఫీ పథకాలను అమలుచేస్తుంది. అయితే మొదటి విడుత గెలిచిన అనంతరం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడుతల్లో రూ. లక్ష లోపు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. అదేవిధంగా రెండో విడుత రుణమాఫీ ప్రక్రియలోనూ ఇప్పటికే రూ.50వేలలోపు పంట రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం..రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. అయితే జిల్లాలో రూ.25 వేలలోపు పంట రుణాలున్న రైతులు 10,807 మంది ఉం డగా రూ.16.24 కోట్లు, రూ.25 వేల నుంచి రూ.50 వేలలోపు ఉన్న రూ.78.41 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. అయితే 50 వేల నుంచి రూ.లక్ష వరకు గల పంట రుణాలు పొం దిన వారు సుమారు 45 వేల మంది ఉండగా.. రూ.130 కోట్ల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది.
ఉద్యోగుల సంక్షేమానికి బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని సుమారు 12వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరనున్నది. మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును ఏప్రిల్ నుంచి క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వాత జిల్లాలోని 180 మంది కాంట్రా క్ట్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. సెర్ప్ ఉద్యోగులకూ పీఆర్సీని అమలు చేయాలని నిర్ణయించిన దృష్ట్యా జిల్లాలోని 186 మందికి ప్రయోజనం చేకూరనున్నది.
బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యమిచ్చారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, మన ఊరు-మన బడి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, ఆరోగ్యశ్రీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి కార్యక్రమాలకు నిధులను కేటాయించడం సంతోషక రం. దేశంలోని ప్రజలందరూ తెలంగాణ వైపు చూసేలా కేటాయింపులున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి చెప్పడం హర్షణీయం. దీని ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రైతులకు సాగునీరు అం దనున్నది. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. మూడు లక్షల ఆర్థిక సా యాన్ని అందించడం ద్వారా పేదలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుం ది. – ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభు త్వం ఈసారి బడ్జెట్ లో అభివృద్ధ్దితోపా టు సంక్షేమానికి పెద్దపీట వేసింది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా.. అన్ని సంక్షేమ పథకాలు సాఫీగా కొనసాగేలా నిధులను కేటాయించింది. స్థలం ఉన్న పేదలు ఇంటి నిర్మాణం చేపడితే రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. దళితబంధు పథకం అమలుకు సైతం నిధుల కేటాయింపుతో పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుంది. బడ్జెట్ కేటాయింపులపై అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.
-కొప్పుల మహేశ్రెడ్డి, ఎమ్మెల్యే పరిగి
బడ్జెట్లో అన్ని వర్గాల సంక్షేమంతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రం గాలకు పెద్దపీట వేశా రు. దళితబంధుతోపాటు గిరిజనుల సంక్షేమానికి నిధులు కేటాయించడం హర్షణీయం. పంట రుణాల మాఫీతోపాటు సొంత స్థలం ఉన్న వారు ఇల్లు నిర్మించుకుంటే రూ.మూడు లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించడం సంతోషకరం. ఈ ప్రభుత్వం పేదల పక్షపాతి అని మరో సారి నిరూపించుకున్నది.
– నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కొడంగల్
రాష్ట్ర బడ్జెట్లో చేవెళ్ల పార్లమెంట్కు రూ.13,645 కో ట్లు కేటాయించడం హర్షణీ యం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించడం శుభపరిణా మం. రాయదుర్గం నుంచి శంషాబాద్ మెట్రోరైలు పనులకు నిధుల కేటాయింపుతోపాటు కోకాపేటలో పైలట్ ప్రాజెక్టు కింద సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మాణానికి రూ.95 కోట్లు కేటాయించడం సంతోషకరం.
– డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎంపీ చేవెళ్ల
ప్రభుత్వం బడ్జెట్ లో అన్ని రంగాలకు పెద్దపీట వేసింది. విద్య, వైద్యం, వ్య వసాయం, విద్యు త్, అభివృద్ధి సంక్షే మ పథకాలకు అధికంగా ప్రాధాన్యమిచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నది. ఇది దేశం గర్వించదగ్గ బడ్జెట్.
-మంచిరెడ్డి కిషన్రెడ్డి ,ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం
ప్రభుత్వం పేదలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ను రూపొందించడం చాలా సం తోషకరం. రైతుల రుణమాఫీతోపాటు సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ.మూడు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొన డం హర్షణీయం. దీని ద్వారా పేదలకు లబ్ధి చేకూరుతుంది. అంతేకాకుండా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణతో వారికి ఉద్యోగ భద్రత లభిస్తుంది.
-అంజయ్యయాదవ్, ఎమ్మెల్యే షాద్నగర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారంజకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిం ది. పేదలకు ఊరటనిచ్చేలా ఉన్నది. పాత పథకాలను కొనసాగిస్త్తూనే సంక్షేమానికి పెద్దపీట వేసింది. రైతు రుణమాఫీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, విద్యుత్తు, విద్యావైద్యంతో పాటు వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధులను కేటాయించడం సంతోషకరం. సీఎం కేసీఆర్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం.
-కాలె యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్ ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించుకున్నది. బడ్జెట్లో అన్ని రంగాలతోపాటు పేదల సంక్షేమానికి అధికంగా ప్రాధాన్యమిచ్చిం ది. రూ. లక్ష లోపు రుణాల మాఫీకి నిధులను కేటాయించడం హర్షణీ యం. రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల పథ కం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్ప డం సంతోషకరం. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు ను క్రమబద్ధీకరించడంతోపాటు సెర్ప్ ఉద్యోగులకు పీఆర్సీని వర్తింపజేయాలని నిర్ణయించడం ద్వారా ఆ కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రభుత్వం కోట్లాది రూ పాయలతో అభివృద్ధి పనులను చేపడుతూ ప్రజలను ఆదుకుంటున్నది.
-జైపాల్యాదవ్, ఎమ్మెల్యే కల్వకుర్తి