ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 4 : పదోతరగతి వార్షిక పరీక్షలకు ప్రభుత్వం తేదీని ఖరారు చేసిన నేపథ్యంలో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కార్యాచరణను రూపొందించింది. ఉపాధ్యాయులను సన్నద్ధం చేయడమే కాకుండా విద్యార్థులకు నిష్ణాతులతో పాఠాలు బోధిస్తూ వారిలో మానసిక ైస్థెర్యాన్ని పెం చుతున్నది.
సెలవులు మినహా పరీక్షలు ప్రారంభమయ్యే వరకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లేలా చర్యలు చేపట్టింది. జిల్లాలోని 1,148 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 50,827 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రతి విద్యార్థీ ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు డీఈవో సుశీందర్రావు తెలిపారు.
టెన్త్లో వంద శాతం ఫలితాలను సాధించటమే లక్ష్యంగా విద్యాశాఖ ముందుకు సాగుతున్నది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో రోజుకు రెండుపూటలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉద యం 9 నుంచి 10గంటల వరకు పాఠ్యాంశాల వారీగా ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వారాంతంలో పరీక్ష నిర్వహించి వెనుకబడిన విద్యార్థులను గుర్తించి తీర్చిదిద్దుతున్నారు. సబ్జెక్టుల వారీగా ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేస్తూ విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు.
జిల్లాలోని ఆదర్శ స్కూళ్లు, కస్తూర్బాగాంధీ, మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, మైనార్టీ సంక్షేమ.. ప్రభుత్వ పాఠశాలల్లోని పదోతరగతి విద్యార్థులు ప్రైవేట్ కు దీటుగా ఉత్తమ ఫలితాలను సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.