రంగారెడ్డి, అక్టోబర్ 10, (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన తండాలకు మంచి రోజులు వచ్చాయి. తండాల్లో అభివృద్ధి పరుగులు పెట్టించేందుకు గాను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. దీంతో తండాల్లో రోడ్లు, డ్రైనేజీ, అంగన్వాడీ భవనాలు, పాఠశాల భవనాలతోపాటు స్వచ్ఛమైన తాగునీరు కూడా గిరిజన తండాలకు చేరింది. ఒకప్పు డు అనుబంధ గ్రామాలుగా ఉన్న తండాలు, గ్రామ పంచాయతీ లుగా ఏర్పాటు కావడంతో గిరిజన తండాల రూపురేఖలు మారి పోయాయి. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులన్నీ గ్రామ పం చాయతీలకే ఖర్చు చేస్తూ, అనుబంధ గ్రామాలుగా ఉన్న తండాల్లో అభివృద్ధిని విస్మరించేవారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్వపరిపాలన అందించడంతో తండాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. రోడ్లు, అండర్ డ్రైనేజీ, మురుగు కాల్వలు, వీధి దీపాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టారు. గతం లో గుక్కెడు తాగునీటి కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న తం డా వాసులు ప్రస్తుతం స్వచ్ఛమైన తాగునీటిని తాగుతున్నారు.
వేసవి వస్తే చాలు కిలోమీటర్ల కొద్ది వెళ్లి బావుల్లో, చెలిమలు, బోర్ల నుంచి తాగునీటిని తీసుకువచ్చే దయనీయ పరిస్థితి ఉండేది. అయితే గతంలో ఎన్నడూ చుక్క నీరు దొరకని తండాల్లో నేడు మిషన్ భగీ రథ నీరు తండాలను తాకడంతో గిరిజనులు సీఎం కేసీఆర్ మా కన్నీటి కష్టాలను తీర్చారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా లో జనాభా ప్రాతిపాదికన 60 తండాలను గ్రామ పంచా యతీ లుగా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెం డోసారి ఎన్నిక లకు వెళ్లే ముందు ఏ ఇంట్లో ఆడపిల్లలు బిందెలు పట్టుకుని నీటి కోసం బయ టకు వెళ్లకుండా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందిస్తామని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకా రం గడువులోగా ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాకాలంలో కలుషిత నీరు తాగడంతో తండాలకు తండాలు రోగాల బారిన పడిన పడుతుండేవారు, ప్రస్తుతం జిల్లాలోని తండాలకు స్వచ్ఛ మైన శుద్ధి జలం ఇంటింటికి చేరుతుండడంతో ఆరోగ్యంగా జీవిస్తున్నారు.
తండాలకు స్వపరిపాలన…
పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలకు స్వపరిపాలన అందించారు. జనాభా ప్రతిపాదికన అనుబంధ గ్రామాలుగా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ నిర్ణయించారు. అనుబంధ గ్రామాలుగా ఉన్నప్పుడు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని గిరిజన తండాలు ప్రస్తుతం అభివృద్ధిలో గ్రామ పంచాయతీలుగా దీటుగా దూసుకుపోతున్నాయి. సంబంధిత తండా ప్రజలంతా సమావేశమై సమస్యలపై చర్చించి, అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తండాల అభి వృద్ధికిగాను ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తుంది. గత ఆర్థిక సం వత్సరం 60 గిరిజన తండాలకు రూ.15 కోట్లకుపైగా ప్రత్యేకంగా నిధులను కేటాయించారు. కొన్నేళ్లుగా లేని అభివృద్ధి రెండు, మూ డేళ్లలో జరగడంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో గిరిజన తండాలకు వెళ్లే రోడ్లతోపాటు తండాలన్నీ బురద మయంగా ఉండేది, కానీ ప్రస్తుతం తండాలన్నీ సీసీ రోడ్లతో పరి శుభ్రంగా దర్శనమిస్తున్నాయి. సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, వీధి దీపాలు, అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ భవనాలు నిర్మించా రు. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకువచ్చిన పల్లెప్ర గతిలో భాగంగా కూడా ప్రతీనెల తండాలకు నిధులు మంజూ రవు తున్నాయి. పల్లెప్రగతిలో భాగంగా తండాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలు, నర్సరీలు, ట్రాక్టర్లు, అం దుబాటులోకి వచ్చాయి. జిల్లాలోని ఏ తండాకు వెళ్లినా స్వచ్ఛగా, పచ్చదనంగా మారిపోయాయి.