పరిగి, మార్చి 23 : కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది, కరువు వచ్చిందని ప్రజలు బాధపడు తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ రైతు బంధు, రైతుబీమా, కేసీఆర్కిట్, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ఇచ్చి పేదలకు మేలు చేస్తే.. అంతకంటే బాగా చేస్తారేమోనని కాంగ్రెస్ను నమ్మి ఎన్నికల్లో గెలిపిస్తే మమ్మల్ని నట్టేట ముం చారని ప్రజలు వాపోతున్నారన్నారు. పరిగిలో శనివారం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చేవెళ్ల అభ్యర్థులుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ప్రస్తుతం బరిలో ఉన్న ఇద్దరికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోనే గుర్తింపు వచ్చిందన్నారు. విశ్వేశ్వర్రెడ్డి, రంజిత్రెడ్డిలను గత ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి గెలిపించారని గుర్తు చేశారు. అభ్యర్థిగా ప్రకటించిన త ర్వాత రంజిత్రెడ్డి ఎందుకు పార్టీ మారారో తెలియదని…కానీ బీఆర్ఎస్ నాయకులు, కార్య కర్తల శక్తిని తక్కువగా అంచనా వేసి పార్టీ వీడిన వారికి మన శక్తి చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
రంజిత్రెడ్డి అంటే ఎవరో కూడా ప్రజలకు తెలియదని.. అలాంటి వ్యక్తికి కేసీఆర్ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించారన్నారు. ఈ లోక్సభ ఎన్నికలను బీఆర్ఎస్ శ్రేణులు ఓ చాలెంజ్గా తీసుకుని కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని, మన ప్రాంతం గురించి ఏమైనా మాట్లాడుతారని వంద రోజులుగా చూస్తున్నా ఫలితం లేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు దాదాపుగా పూర్తైందని.. త్వరగా కాల్వలు తవ్వి మన ప్రాంతానికి సాగు నీటిని తీసుకొద్దామనే ఆలోచన సీఎంకు లేదన్నారు. మైకు పట్టుకుంటే చాలు కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. గతేడాది డిసెంబర్ 9న వికారాబాద్ చౌరస్తాలో నిలబడి రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని రేవంత్రెడ్డి ప్రకటించారని, ఆ హామీని ఇంకా ఎందుకు అమలు చేయడంలేద ని ప్రశ్నించారు. బీజేపీ వారు జైశ్రీరామ్ అంటుండగా.. కాంగ్రెస్ వారు గేట్లు ఎత్తుతామంటు న్నారని.. సీఎం రేవంత్రెడ్డి కండువాలు వేసి మురిసిపోతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలిస్తే మనల్ని నిర్లక్ష్యం చేస్తారని.. బడుగుల గొంతు పార్లమెంట్లో వినిపించాలంటే జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి జ్ఞానేశ్వర్కు పరిగి, వికారాబాద్, తాండూరు అంటే ఎనలేని ప్రేమ అని, ఆయన జడ్పీచైర్మన్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డికి ఫోన్ చేసి మనవాళ్లు ఏమంటున్నారని అడిగితే.. ‘మొదటి సమావేశాన్ని పరిగిలోనే ఏర్పాటు చేయాలని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారని’ అన్నారు.
పరిగి ప్రాంతంలోని అన్ని వర్గాల వారితో జ్ఞానేశ్వర్కు మంచి సంబంధాలున్నాయని, సేవాగుణంలో ఆయన ముందుంటారని కొనియాడారు. ప్రజానాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ను చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. జ్ఞానేశ్వర్ను అభ్యర్థిగా ప్రకటించగానే బడుగు, బలహీన వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నదన్నారు. జ్ఞానేశ్వర్ చేసిన సేవలకు రుణం తీర్చుకోవడంతోపాటు ఆయనను గెలిపించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు బహుమతిగా ఇద్దామని సబితారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. ప్రతి గ్రామంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు వాటిని ఎలా పెంచుకోవాలనే దానిపై దృష్టి పెడితే తప్పనిసరిగా బీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమన్నారు. సమావేశానికి వచ్చిన ప్రతి కార్యకర్త వంద మం దిని ప్రభావితం చేయాలని.. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు బీఆర్ఎస్ శ్రేణులు రెండు నెలలపా టు ప్రజా క్షేత్రంలోనే ఉండాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని మాట్లాడే వారిపై మండిపడ్డారు. సూర్యాచంద్రులు ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరు పలుకుతూనే ఉంటారన్నారు. ప్రాణాన్ని లెక్క చేయకుండా రాష్ర్టాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని సబితారెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, హరిప్రియ, మలిపెద్ది మేఘమాల, రాందాస్నాయక్, శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీలు కరణం అరవిందరావు, మల్లేశం, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పు ల శ్యాంసుందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కాసాని వీరేశ్, గణేశ్గుప్తా, సురేందర్, ఆంజనేయులు, సుధాకర్రెడ్డి, రాజేందర్, ప్రవీణ్కుమార్రెడ్డి, సుభాష్చందర్రెడ్డి, గోపాల్రెడ్డి, రాంచంద్రయ్య, అజహర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాలకు మేలు
కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాలకు మేలు జరిగింది. పదేండ్ల పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందాయి. రానున్న లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల అభ్యర్థిగా కేసీఆర్ నిర్ణయించిన జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు.
-కాలె యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే
రానున్న రోజుల్లో పూర్వవైభవం పక్కా..
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా వెళ్లిపోతున్న వారిని భవిష్యత్తులో తిరిగి చేర్చుకోరాదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది లైన్లు కట్టారు.. ప్రస్తుతం పార్టీని వీడడం సమంజసం కాదు. పార్టీ కన్నతల్లి లాంటిది. ఎంతోమంది నాయకులను కేసీఆర్ తయారు చేశారు. కష్టకాలంలో అండగా ఉన్న వారే నిజమైన కార్యకర్తలు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్కు పూర్వవైభవం కచ్చితంగా వస్తుంది.
-మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే
కేసీఆర్కు బహుమతిగా ఇద్దాం..
ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటా. పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపిస్తా. కేసీఆర్ పాలనలో ప్రజలకు మంచి పనులు జరిగాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికీ చేరాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా ల ప్రజలతో మంచి సంబంధాలున్నాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రెండు నెలలపా టు ప్రజాక్షేత్రంలో ఉండాలి. చేవెళ్లలో భారీ మెజార్టీతో విజయం సాధించి పార్టీ అధినేత కేసీఆర్కు బహుమతిగా ఇద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తాం.
-కాసాని జ్ఞానేశ్వర్, బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి
బీజేపీ, కాంగ్రెస్లకు అభ్యర్థులే లేరు..
దేశంలోని ప్రాంతీయ పార్టీలను నామరూపాల్లేకుండా చేయాలనే అజెండాను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పెట్టుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్లకు అభ్యర్థుల్లేక బీఆర్ఎస్ నాయకులను తీసుకెళ్లి టికెట్లు ఇస్తున్నారు. నేడు అధికారం కోసం.. స్వలాభం కోసం పార్టీ మారిన నాయకులకు రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి. అందుకు కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఆయన జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్సీగా ఈ ప్రాంత అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. వ్యక్తిగతంగా అనేక మందిని ఆదుకున్నారు. అధికారంలోకి వచ్చి వంద రోజులైనా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ ల్యాలే తమ అస్ర్తాలు చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలి.
-కొప్పుల మహేశ్రెడ్డి , పరిగి మాజీ ఎమ్మెల్యే
పదేండ్లలో ఆనందంగా ప్రజలు..
పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్తును అందించిన ఘనత కేసీఆర్కే దక్కింది. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ప్రజలు కరెంటు కష్టాలు పడుతున్నారు. మన ప్రాంతం వారు కాకున్నా రంజిత్రెడ్డిని గెలిపించుకున్నాం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు చూసినా కేసీఆర్, కేటీఆర్ దగ్గరే ఉండేవారు. అధికారం కోల్పోగానే పార్టీ మారడం ఎంతవరకు సమంజసం. బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి పనిచేసి రానున్న ఎన్నికల్లో బీసీ నాయకుడైన కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలి
– ప్రకాశ్గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే
ప్రతి మనిషికీ విలువనేది ఉండాలి : ఎమ్మెల్సీ వాణీదేవి
ఎవరి నుంచైనా సాయం పొందినప్పుడు విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం లేని బతుకు అదేం బతుకు. పార్టీ ఓడిపోయిన వెంటనే అధికారం అనుభవించిన వారు పార్టీ మారడం సరికాదు. రంజిత్రెడ్డి ఎవరో కూడా ప్రజలకు తెలియదు.. అలాంటి వ్యక్తికి కేసీఆర్ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించడంతోపాటు.. సునీతారెడ్డిని రెండు పర్యాయాలు జడ్పీ చైర్పర్సన్గా, మహేందర్రెడ్డికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా అవకాశం కల్పించారు. అలాంటి వారు పార్టీ మారడం ఎం తవరకు సమంజసం. ప్రతి మనిషికీ విలువ అనేది ఉండాలి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగింది. గెలుపోటములు ఎవరి చేతుల్లో లేవు. బీఆర్ఎస్ శ్రేణులు సైనికులవలె పనిచేసి చేవెళ్ల ఎంపీగా జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలి.