రంగారెడ్డి, మే 20 (నమస్తే తెలంగాణ): పదోతరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్ రూముల నుంచి పరీక్షా కేంద్రాల పరిధిలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్టికెట్లను అం దించే ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఇంకా ఎవరైనా విద్యార్థులు హాల్టికెట్లు తీసుకోకపోతే ఆన్లైన్లో లేదా మీ సేవా కేంద్రాల నుంచి తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ను పోలీ సులు అమలు చేయనున్నారు. మరోవైపు పదోతరగతి విద్యార్థులకు డిసెంబర్ నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించిన దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఏడాది వంద శాతం ఉత్తీర్ణత వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లాలో 282 పరీక్షా కేంద్రాలు
ఈనెల 23 నుంచి జూన్ 1 వ తేదీ వరకు జరుగనున్న టెన్త్ పరీక్షలకు రంగారెడ్డి జిల్లాలో 282 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశా రు. ప్రశ్నాపత్రాలను ఇప్పటికే స్ట్రాంగ్రూముల నుంచి జిల్లాలోని 31 పోలీస్స్టేషన్లకు తరలించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నా యి. జిల్లాలోని 47,560 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో బాలురు 24,071 మంది, బాలికలు 23,489 మంది ఉన్నారు. మరోవైపు అధికారులు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకా ల చర్యలను పూర్తి చేశారు. ఒక్కో పరీక్షా కేంద్రానికి 11 మంది చొప్పున జిల్లావ్యాప్తంగా 3,320 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అదేవిధంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాకుండా ఫ్లయింగ్ స్కాడ్స్ బృందాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక్కరు చొప్పున 282 చీఫ్ సూపరింటెండెంట్లు, 282 మంది డిపార్ట్మెంటల్ అధికారులు విధులను నిర్వహించనున్నారు. అదేవిధంగా పరీ క్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనున్నది. పరీక్షా కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో ఉన్న జిరా క్స్, ఇంటర్నెట్ కేంద్రాలను పరీక్షలు ముగిసే వరకూ అధికారులు మూసివేయనున్నారు.
‘ప్రభుత్వ’ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఈ ఏడాది టెన్త్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారులు అంచ నా వేస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యేలా ప్రత్యేక చర్య లు చేపట్టారు. డిసెంబర్ నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించారు. ప్రతిరోజూ ఉదయం గంటన్నర, సాయంత్రం గంటన్నర పాటు ప్రత్యే క తరగతులను నిర్వహించారు. ప్రతి సబ్జెక్టుపై ప్రత్యేక తరగతులను నిర్వహించి చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, వారు సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా చర్యలు తీసుకున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
పదోతరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే విద్యార్థులకు హాల్ టికెట్లను పంపిణీ చేశాం. ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్ రూముల నుంచి తీసుకొచ్చి పరీక్షా కేంద్రాల పరిధిలోని పోలీస్ స్టేషన్లకు తరలించడం పూర్తయ్యింది. అదేవిధంగా పదో తరగతి విద్యార్థులపై గత నాలుగైదు నెలలుగా ప్రత్యేక దృష్టి సారించి చదివించడంతో ఈ ఏడాది వంద శాతం ఉత్తీర్ణత వస్తుందని ఆశిస్తున్నాం.
– సుశీంద్రరావు, జిల్లా విద్యాశాఖ అధికారి, రంగారెడ్డి
ఇబ్బందులుంటే విద్యార్థులు