ఇబ్రహీంపట్నంరూరల్, అక్టోబర్ 10 : అభివృద్ధి, సంక్షేమంలో రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలుపడం టీఆర్ఎస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రాయపోల్, దండుమైలారం, ముకునూరు గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీలను ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లె పల్లెనా ప్రకృతి వనాలు ఏర్పాటు చేయించి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించామన్నారు. ప్రతి గ్రామంలో సీసీరోడ్లు, భూగర్భడ్రైనేజీల ఏర్పాటు, వైకుంఠధామం, చెత్తసేకరణకు ట్రాక్టర్లు, ఇంటింటికీ తడి, పొడి చెత్తబుట్టలు అందజేసి గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశామన్నారు. హరితహారంతో రోడ్లకిరువైపులా పచ్చనిచెట్లు దర్శనమిస్తున్నాయన్నారు. ఆరేండ్ల కింద నాటిన మొక్కలు నేడు వృక్షాలు మారాయన్నారు. రైతులు, కులవృత్తిపై ఆధారపడి జీవించే వారికి చేతినిండా పనిదొరుకుతున్నదన్నారు. గతంలో నియోజకవర్గం కరువు కాటకాలతో ఉండేదన్నారు. వర్షాలు సమృద్ధిగా పడడంతో పాటు రైతుబంధుతో రైతులు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి పేర్కొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
గ్రామాలను అభివృద్ధితో పాటు స్వచ్ఛతలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి సూచించారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వీధులను శుభ్రం చేయడం, నిల్వ నీటిని తొలగించడం, మురుగునీటి కాల్వలు శుభ్రం చేయించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఎప్పటికప్పుడు రసాయన మందులు, బ్లీచింగ్ పౌడర్ చల్లించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మహిపాల్, ఎంపీపీ కృపేశ్, వైస్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, సర్పంచ్లు మల్లీశ్వరి, బల్వంత్రెడ్డి, జ్యోతిరాజు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు భరత్రెడ్డి, ఎంపీటీసీలు అచ్చన, జ్యోతి, అనసూయ, సహకార సంఘం చైర్మన్ వెంకట్రెడ్డి, ఎంపీడీవో మహేశ్బాబు, ఏఈ ఇంద్రసేనారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు రాజు ఉద్యమ రచయిత బోడ చంద్రప్రకాశ్ పాల్గొన్నారు.