కొడంగల్, సెప్టెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవతో కరోనా వ్యాక్సిన్లపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతోపాటు ఇటీవల స్పెషల్డ్రైవ్ ఏర్పాటు చేసి పల్లెపల్లెలో వ్యాక్సిన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసింది. సిబ్బంది ప్రతిరోజూ పెద్దసంఖ్యలో వ్యాక్సిన్లు వేస్తున్నారు. గత పదిరోజుల్లోనే 1,30,000 మంది కరోనా టీకా వేయించుకున్నారు. వందశాతం వ్యాక్సినేషనే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. మొదటగా 60 సంవత్సరాలు పైబడ్డ వారికి, ఆ తర్వాత 45 సంవత్సరాలు పై బడ్డ వారికి, ప్రస్తుతం 18 సంవత్సరాలు పైబడ్డ వారికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా కరోనా వైరస్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సదస్సులు ఏర్పాటు చేసింది. ఆయా ప్రాంతాల్లో కరోనా సెంటర్లను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు చేపట్టింది. మొదట్లో వ్యాక్సిన్ వేయించుకోవడానికి చాలా వరకు ప్రజలు భయపడ్డారు. తక్కువ శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రస్తుతం కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నది. 100శాతం టీకా వేయాలనే లక్ష్యంతో ఇంటింటి సర్వే నిర్వహించారు. వ్యాక్సిన్ తీసుకోనివారిని గుర్తించి ఇంటి వద్దే వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఈ ఏడాది జనవరి 16వ తేదీ నుంచి కరోనా టీకా కార్యక్రమానికి ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు జిల్లా పరిధిలో రెండు లక్షల మందికి టీకా వేశారు. ఈనెల 16వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇంటింటి సర్వే, వ్యాక్సినేషన్తో ఇప్పటి వరకు లక్షా30వేల మందికి వ్యాక్సి న్ వేసినట్లు అధికారులు తెలిపారు.
కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం నిర్వ హిస్తున్న ఇంటింటికీ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలు ఇస్తున్నది. మొదల్లో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రాని వారు నేడు అవగాహన పెంచుకున్నా రు. స్వచ్ఛందంగా కరోనా టీకా వేయించు కుంటున్నారు. గ్రామ స్థాయిలో వ్యాక్సిన్ కేంద్రాల ఏర్పాటు అందరికీ సౌకర్యంగా ఉంది.
-ముద్దప్ప దేశ్ముఖ్, ఎంపీపీ, కొడంగల్
కరోనా కట్టడి అందరి బాధ్యత
కరోనా కట్టడి అందరి బాధ్యత. గత ఏడాదిన్నర కాలంగా కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీన్ని అధిక మించాలంటే వ్యాక్సినేషన్తో పాటు నిబంధనలు తప్పకుండా పాటించాలి. 100శాతం వ్యాక్సినేషనే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నాం.
– డా.రవీంద్రయాదవ్, డిప్యూటీ డీఎంహెచ్వో, వికారాబాద్