అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటా
టీఎస్పీఎస్సీ సభ్యుడు ఎరవెల్లి చంద్రశేఖర్ రావు
ముస్తాబాద్, మే 21: తనపై నమ్మకంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా నియమించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటానని, పదవికి న్యాయం చేస్తానని టీఎస్పీఎస్సీ సభ్యుడు ఎవవెల్లి చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని టీఎస్పీఎస్సీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తానన్నారు. పార్టీ అగ్రనాయకత్వం ఇచ్చిన ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంకితభావంతో పని చేసి న్యాయం చేస్తానన్నారు. తన ఎంపికకు సహకరించిన ప్రజాప్రతినిధులు, నాయకులకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.