సిరిసిల్ల రూరల్ : మద్యం షాపుల కేటాయింపుల్లో దళితులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని హర్షిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం తంగళ్లపల్లి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ చిరంజీవి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలోనే కులవృత్తులకు ప్రాధాన్యం లభిస్తున్నదన్నారు. మద్యం షాపుల కేటాయింపుల్లో గౌడ కులస్తులు, దళితులు,గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించడం చారిత్రక నిర్ణయమన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ దాసరి ఆనందం, సిరిసిల్ల సురేశ్, బూర తిరుపతి, సిలువేరి సంజీవ్, శ్రావణ్,శేఖర్, ప్రసాద్, శ్రీనివాస్ ,రమేశ్ ఉన్నారు.