వేములవాడ టౌన్, డిసెంబర్ 6: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆల యం సోమవారం భక్తులతో పోటెత్తింది. భక్తుల శివనామస్మరణతో ఆలయం మా ర్మోగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు వేకువజామునే పవిత్ర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ అధికారులు ఆర్జితసేవలను రద్దు చేసి లఘు దర్శనం ఏర్పాటు చేశారు. రాజన్నను సుమారు 35 వేల మందికి పైగా దర్శించుకున్నారని, ఆర్జిత సేవల ద్వారా సుమారు రూ.17 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
30రోజుల్లో 8.94కోట్లు
రాజన్న ఆలయానికి భారీ ఆదాయం వచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 30 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 8 కోట్ల 94 లక్షల 61,011 సొమ్ము సమకూరింది. గత నెల 5వ తేదీ నుంచి ఈ నెల 4వతేదీ దాకా కార్తీక మాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయానికి హుండీ ద్వారా 3కోట్ల 54 లక్షల 46వేల 446, కోడె టిక్కెట్ల ద్వారా కోటి 92లక్షల 85వేల 247, ప్రసాదాల ద్వారా కోటి 66లక్షల 95వేల 560, వసతిగదుల ద్వారా 34లక్షల 69వేల 382, రుద్రాభిషేకం ద్వారా 12లక్షల 63వేల 400, శీఘ్రదర్శనం టిక్కెట్ల ద్వారా 33లక్షల90వేల600, కల్యాణ టిక్కెట్ల ద్వారా 48లక్షల 10వేలు, కేశఖండనం టిక్కెట్ల ద్వారా 8లక్షల 83వేల 520, బద్దిపోశమ్మ ఆలయం ద్వారా 12లక్షల 80వేల 520, ఇతర ఆర్జితసేవల ద్వారా 29లక్షల 36వేల 336.. మొత్తంగా 8 కోట్ల 94 లక్షల 61,011 సమకూరినట్లు ఈవో కృష్ణప్రసాద్ వెల్లడించారు.