ఎల్లారెడ్డిపేట, జూలై 14: రైతులు, సహకార సంఘం చైర్మన్లు, సభ్యులు అందించిన సహకారంతోనే తనకు జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. బుధవారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ కార్యదర్శి సుజన్బాబు ఉద్యోగోన్నతిపై వెళ్తున్న సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పూర్తిస్థాయి భరోసాను కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే అని కొనియాడారు. అనంతరం నాబార్డు జాతీయస్థాయి ఉత్తమ అవార్డు అందుకున్న రవీందర్రావును ఏఎంసీ చైర్మన్ కొండ రమేశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సన్మానించారు. ఇక్కడ టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు చాంద్, గంభీరావుపేట, పోత్గల్ ఏఎంసీ చైర్మన్లు సుతారి బాలవ్వ, జానాబాయి, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడ జగన్, మార్కెటింగ్ ఎండీ షాబొద్దీన్, ఉమ్మడి జిల్లా డీఈ మునీందర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కొండాపురం బాల్రెడ్డి, నాయకులు అందె సుభాష్, పాశం దేవరెడ్డి, ముక్క శంకర్, పడిగెల రవీందర్, మాడుగుల మల్లేశం గుగులోత్ శ్రీరాంనాయక్, పీఏసీఎస్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఆత్మీయ సన్మానం
సిరిసిల్ల టౌన్, జూలై 12: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నాబార్డు జాతీయ అవార్డుకు ఎంపికైన సందర్భంగా బుధవారం గంభీరావుపేట సింగిల్ విండో కార్యాలయంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావును టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆయన వెంట కేడీసీసీబీ డైరెక్టర్ వీరబత్తిని కమలాకర్, తదితరులుఉన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
గంభీరావుపేట, జూలై 14 : మాజీ ఎంపీటీసీ లక్కిరెడ్డి కమలాకర్రెడ్డి తల్లి సరస్వతి దశ దిన కర్మ కార్యక్రమానికి బుధవారం నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుతోపాటు టీఆర్ఎస్ రాష్ట్ర నేతలు హాజరై నివాళులర్పించారు. టీఆర్ఎస్ జిల్లాఅధికార ప్రతినిధి తోట ఆగయ్య, రాష్ట్రనేతలు చీటి నర్సింగ రావు, గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల పట్టణ అద్యక్షుడు జిందం చక్రపాణి. జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు చక్రధర్రెడ్డి, కొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపగారి వెంకటస్వామిగౌడ్, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్రెడ్డి తదితరులు ఉన్నారు.