ఓదెల : ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పొత్కపల్లి ట్రైనీ ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన అల్లం ప్రసన్న (21)ను ఓదెలకు చెందిన రాంనేని సందీప్ వివాహం చేసుకుంటానని నమ్మించి నిరాకరించడంతో ఆమె మనస్తాపం చెంది సోమవారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
గమనించిన కుటుంబ సభ్యులను ఆమెను వెంటనే సుల్తానాబాద్లోని దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం రాత్రి మృతి చెందినట్లు ట్రైనీ ఎస్ఐ తెలిపారు. మృతురాలు తండ్రి రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సందీప్, అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.