పెద్దపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ లారీ డ్రైవర్ను గుర్తు తెలియని దుండగలు హత్య చేశారు. ఈ సంఘటన జిల్లాలోని గోదావరిఖని పరిధి గంగానగర్లో చోటు చేసుకుంది. గంగానగర్ కాలనీకి చెందిన సప్ప రాయమల్లు (45) లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అయితే కొంత మంది మిగతా డ్రైవర్లతో కలసి రాత్రి మందు పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.
దీంతో రాయమల్లును వారే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. గోదావరిఖని టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలోకి దింపి హత్యకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. పూర్వి వివరాలు తెలియాల్సి ఉంది.