జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు
ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ముమ్మరంగా పనులు
నేడు జిల్లాకు మంత్రి, ఎంపీల రాక
గోదావరిఖని, జూలై 23: ముక్కోటి వృక్షార్చనకు సర్వం సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటేందుకు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పనులు ముమ్మరంగా చేపట్టారు. మంత్రి ఈశ్వర్, ఎంపీలు జోగినపల్లి సంతోష్కుమార్, వెంకటేశ్నేతకాని హాజరై కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గోదావరిఖనిలో ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఈ వృక్షార్చనకు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ సంతోష్కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారని వివరించారు. రామగుండం బల్దియా కార్యాలయం నుంచి ఉదయం 9 గంటల నుంచి చౌరస్తా దాకా మొక్కలు నాటే కార్యక్రమం ఉం టుందని, అనంతరం యైటింక్లయిన్ కాలనీలో వృక్షార్చన కొనసాగనుందన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఒక్కరోజే ఐదు లక్షల మొక్క లు నాటనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
గనులపై..
సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో తల పెట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ పిలుపునిచ్చారు. ఆయా గనుల్లో టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీలు శనివారం ఉదయం 7గంటలకు జన్మదిన కేక్ కట్ చేసి మొక్కలు నాటాలని సూచించారు. సింగరేణి ఏరియా దవాఖానల్లో పండ్ల పంపిణీతో వృక్షార్చనను విజయవంతం చేయాలని కోరారు.
ఆర్జీ-1 ఆధ్వర్యంలో ముక్కోటి వృక్షార్చన నిర్వహించనున్నట్లు జీఎం నారాయణ తెలిపారు. ఈ మేరకు జీఎం కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ కోసం ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ఆర్జీ-1 పరిధిలోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం త్యాగరాజు, ఏజెంట్లు శ్రీనివాస్, శ్రీనాథ్, డీజీఎం నవీన్, మదన్ మోహన్, సలీం, ఫారెస్టు ఆఫీసర్ అభిలాశ్, వీరారెడ్డి ఉన్నారు.
సుల్తానాబాద్, జూలై 23 : పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రెండు లక్షల పండ్ల మొక్కలు నాటనున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. సుల్తానాబాద్లోని శాస్త్రీనగర్ వద్ద ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టనున్న ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు సంతోష్కుమార్, వెంకటేశ్ నేతకాని హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్గౌడ్, తహసీల్దార్ పాల్సింగ్, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు ఉపేందర్రావు, జ్యోత్స్న, నాయకులు ముత్యం రమేశ్గౌడ్, రేవెల్లి తిరుపతి, సాజిద్, రాజమల్లయ్య, నరేందర్ ఉన్నారు.
కాల్వశ్రీరాంపూర్, జూలై 23: కేటీఆర్ జన్మదినం సందర్భంగా మండలంలోని అన్ని గ్రామా ల్లో శుక్రవారం మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి సొంత ఖర్చులతో పండ్ల మొక్కలు పంపిణీ చేశారని వివరించారు. కార్యక్రమంలో విండో చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, ఎంపీడీవో కిషన్, సర్పంచ్ ఆడెపు శ్రీదేవీరాజు,ఎంపీటీసీ మాదాసి సువర్ణ రాంచంద్రం, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ నిదానపురం దేవయ్య, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఇబ్రహీం, టీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు నూనేటి కుమార్, నాయకులు దాసరి నరేందర్, కేతుపెల్లి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి రూరల్, జూలై 23 పెద్దపల్లి మం డలంలోని గౌరెడ్డిపేటలో ఎంపీపీ బండారి స్రవంతీ శ్రీనివాస్ గౌడ్ పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు పోసాని భారతి, రమ్య, వైష్ణవి, పోసాని సతీశ్, శశి, బూరం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
జూలపల్లి, జూలై 23: మండల కేంద్రంలో శుక్రవారం ఎంపీపీ కుసుకుంట్ల రమాదేవి పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సొంత ఖర్చులతో నాలుగు వేల పండ్ల మొక్కలను సరఫరా చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మనోహర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ఎంపీడీవో వేణుగోపాల్రావు, ఏపీవో సదానందం, కొత్త రవీందర్, శ్రీకర్ పాల్గొన్నారు.
పెద్దపల్లి జంక్షన్, జూలై 23: పట్టణంలోని 19 వార్డు పరిధిలో పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సమకూర్చిన పండ్ల మొక్కలను కౌన్సిలర్ బెక్కం అంజమ్మ ఆధ్వర్యంలో ఆమె కుమారుడు బెక్కం ప్రశాంత్ ఇంటింటికీ అందజేశారు. కార్యక్రమంలో శారద, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
రామగిరి, జూలై 23: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ముక్కోటి వృక్షార్చన చేపట్టనున్నట్లు ఆ పార్టీ మం డలాధ్యక్షుడు శెంకేసి రవీందర్ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ హాజరుకానున్నారని వివరించారు. కోదండ రామాలయం, సాయిబాబా గుడిలో జరిగే గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొంటారని, అనంతరం చందనాపూర్, సెంటినరీకాలనీ రామాలయం దగ్గర మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరవుతారని వివరించారు.
విజయవంతం చేయండి
రామగిరి, జూలై 23: సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా ప్లాంటేషన్ను విజయవంతం చేయాలని ఆర్జీ-3 జీఎం మనోహర్ కోరారు. ఈ మేరకు తన కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్జీ-3 ఏరియా పరిధిలోని అడ్రియాల పోశమ్మ గుడి దగ్గర నుంచి గోదావరిఖనికి వెళ్లే దారిలోని ఖాళీ స్థలంలో ఈ మెగా హరితహారం చేపట్టనున్నామని వివరించారు. సుమారు 10వేల నుంచి 20వేల మొక్కలను నాటుతామని తెలిపారు. సుమారు 20 వేల నుంచి 30వేల మొక్కలను సమీప గ్రామాలు, కాలనీ వాసులు, ఉద్యోగులకు పంపిణీ చేస్తామని జీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్ ఎలీషా, ఎస్వోటూ జీఎం రఘుపతి, ఏజీఎం సివిల్ రామకృష్ణ, డీజీఎం పర్సనల్ విలాస్ శ్రీనివాస్, ఫారెస్ట్ మేనేజర్ కర్ణ, ఎన్విరాన్మెంట్ అధికారి షఫీ తదితరులు ఉన్నారు.