ఎల్బీనగర్, మే 24: నీటి ఎద్దడిని నివారించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం సరూర్నగర్ ప్రియదర్శిని పార్కు వద్ద గడ్డిఅన్నారం డివిజన్ కాలనీవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు జనాభా పెరుగుతున్న నేపథ్యంలో భావితరాలకు ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా చూస్తామన్నారు. సాహెబ్నగర్ రిజర్వాయర్ నుంచి ప్రత్యేక ఫీడర్ లైన్ను వేశామని, గత లాక్డౌన్ సమయంలోనే నూతన పైపులైన్ కర్మన్ఘాట్ ఇంద్ర, నాగేంద్ర థియేటర్ నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర చైతన్యపురి డీసీబీ బ్యాంక్ వరకు వేశామన్నారు.
ఇట్టి ప్రధాన ట్రంక్లైన్ నుంచి పరిసర కాలనీల వాసులకు ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. గడ్డిఅన్నారం డివిజన్ కాలనీవాసుల కోసం శంకేశ్వర్బజార్ నుంచి రెడ్క్రాస్ ఆసుపత్రి వరకు 8 ఇంచుల లైన్ను 12 ఇంచుల లైను, గడ్డిఅన్నారం కాలనీ నుంచి పీఅండ్టీకాలనీ పాత పోస్టు ఆఫీస్ వరకు 6 ఇంచుల పైపులైన్ను 8ఇంచుల పైపులైన్ నిర్మాణం చేయించామన్నారు. గడ్డిఅన్నారం డివిజన్లోని దాదాపు 10 కాలనీలకు నీటి సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. రాబోయే రోజుల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల మంచినీటి సమస్యల పరిష్కారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రవీణ్కుమార్, బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, ప్రేంనాథ్గౌడ్, రమేశ్ముదిరాజ్, భాస్కర్, రమణ, కిరణ్, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు పడిదం కృష్ణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, బాల సుబ్రహ్మణ్యం, పలువురు పాల్గొన్నారు.