అమరావతి : ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు.
గుంటూర్ జిల్లా దుగ్గిరాల సమీపంలో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. బస్సు అతివేగంగా ఢీకొట్టంతో కారు నుజ్జునుజ్జై మృతదేహాలు వాహనంలోనే ఇరుక్కు పోయాయి.
స్థానికులు అతికష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు.
మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.