హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 204 మైనార్టీ పాఠశాలల్లో ఇప్పటివరకు 83 స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసినట్టు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గతేడాది 12, ఈ ఏడాది 71 పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా మార్చినట్టు తెలిపారు. 119 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఎస్సీ హాస్టళ్ల విద్యార్థుల కోసం త్వరలో సోలార్ వాటర్ హీటర్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పహడీ షరీఫ్, మౌలాలీ దర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.