‘వృక్షవేదం’ కేవలం ఛాయాచిత్రాలతో కూడిన అందమైన పుస్తకం మాత్రమే కాదు. ఇందులో భారతీయ ఆత్మ ఉంది. తెలం గాణ నలుచెరగులా పరుచుకున్న ప్రకృతి ఉంది. ఈ నేలమీదికి అతి థుల్లా వచ్చిన మనిషి ఏం చేయాలో కర్తవ్యబోధ చేస్తుంది. పరోప కారుల సంపద ఎప్పుడూ పరుల కోసమే అన్నట్టు.. ‘వృక్షవేదం’లోని ప్రతీ పేజీ భావితరాల కోసమే.
తెలంగాణ దార్శనికుడు సీఎం కేసీఆర్ మానసపుత్రిక ‘తెలంగాణకు హరితహారం’. ఆ స్ఫూర్తితో మొదలైందే ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ హరిత ఉద్యమం దేశవ్యాప్తంగా చల్లటి పవనమై వీస్తోంది. ‘పదిబావులు ఒక దిగుడు బావితో సమానం. పది దిగుడుబావులు ఒక చెరువుతో సమానం. పది చెరువులు ఒక కొడుకుతో సమానం. పదిమంది కొడుకులు ఒక చెట్టుతో సమానం..’ మత్స్యపురాణంలో పేర్కొన్న ఈ కొటేషన్ ఒక్కటి చాలు. ‘వృక్షవేదం’ పుస్తకం ఎందుకు సార్థకమైందో చెప్పడానికి. ఎవరైనా సంపదలు కోరుకుంటే ఒక చెరువు వొడ్డున మంచి మొక్క నాటాలి అంటారు. దాన్ని కొడుకులా పెంచాలని బోధిస్తారు. ‘వృక్షవేదం’లోని ఈ సూక్తి చెట్టు ఎంతటి తరిగిపోని ఆస్తో చెప్పకనే చెబుతుంది. పువ్వు దేవుణ్ని పూజిస్తుంది. పండు పితృదేవతలను కొలుస్తుంది. నీడతో అతిథులు సంబరప డతారు. ఇలా భూమ్మీద నిత్యం పూజలందుకునేది కేవలం చెట్టు మాత్రమే. పరులకోసం బతికే చెట్టు గొప్పతనాన్ని భాగవతంలోని ఓ శ్లోకం చెబుతుంది. అలాంటి వృక్షాల ఔన్నత్యాన్ని చాటిచెప్పింది వృక్షవేదం పుస్తకం.
ఈ పుస్తకం తపోధ్యానంలో మునిగిన రుషికి నీడపట్టిన చెట్టుకొమ్మలా కనిపిస్తుంది. వేరు నుంచి ఫలం వరకు చెట్టు మనిషికి ఎలా ఉపయోగపడుతుందో.. వృక్షవేదంలోని ప్రతీపేజీలోని ప్రతీసూక్తి జీవనసారాన్ని ప్రతి బింబిస్తుంది.
2018 జులైలో ‘హరా హైతో బరా హై’ నినాదంతో ప్రారంభిం చిన ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ప్రతిఒక్కరినీ పర్యావరణ ప్రేమికులుగా మార్చింది. ఈ హరితయజ్ఞం అతి తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు సాధించింది. అన్నం నుంచి జంతుజాలం పుడుతుంది. ఆ అన్నం వర్షంవల్ల సమకూరుతుంది. ఆ వర్షం యజ్ఞంవల్ల సంభవిస్తుంది. ఆ యజ్ఞం సత్కర్మ ద్వారా ఉత్పన్నమవుతుంది. దివ్యజ్ఞానంతో అర్థం చేసుకుంటే- యజ్ఞం చెట్టుతో సమానం. అన్నం ప్రసాదించే చెట్లను పెంచడమంటే నిర్విరామంగా యజ్ఞం చేసినట్టే..!
-రత్నశ్రీ , 9553955320