సకలజనుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుడుతున్నది. ‘కంటివెలుగు’, ‘రైతుబంధు’, ‘రైతుబీమా’ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. కానీ, ప్రతిపక్షాలు మాత్రం పనిగట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నాయి.
నేడు తెలంగాణలో సబ్బండ వర్గాల జీవితాల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. ఎనిమిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నేడు దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.
ఈ విషయమై మంత్రులు కేటీఆర్, హరీశ్రావు అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘మన ప్రతిపక్ష నాయకులు నిండు పున్నమిలో చందమామ వెలుగులు చూడాల్సింది పోయి.. ఆ చందమామ మీద ఉన్న మచ్చలు వెతికే ప్రయత్నం చేస్తున్నార’న్నారు. అవును. నూటికి నూరు శాతం బీజేపీ, కాంగ్రెస్ నాయకుల తీరు చంద్రుని మీద మచ్చలు వెతుకుతున్నట్లే ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లోని సింహభాగం నిధులను పేద, బడుగు, బలహీన వర్గాల కోసమే కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇటీవలి బడ్జెట్లో వృద్ధులకు రక్షణ ఉన్నది. పసి పిల్లలకు పోషణ ఉన్నది, బడి పిల్లలకు శిక్షణ ఉన్నది, ఉన్నత విద్యకు ఉపకారం ఉన్నది, యువతకు ఉద్యోగ కల్పన ఉన్నది, ఆరిపోని కరెంటు వెలుగులున్నాయి. నదీజలాలను ఎత్తిపోసే విజయాలున్నాయి. మత్తడి దుంకుతున్న చెరువుల తళతళలు, చెరువులో చేపపిల్లల మిలమిలలు, జలరాశుల గలగలలు, ధాన్యరాశుల కళకళలున్నాయి. ఇవన్నీ చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తుండటం హాస్యాస్పదం. వారి తీరును చూస్తుంటే పేద ప్రజలు బాగుపడవద్దన్న భావన వారిలో కనిపిస్తున్నది.
తెలంగాణ ఇప్పుడు దేశానికే ‘రోల్ మాడల్’. ఈ కృషి వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, రాజనీతిజ్ఞత, చిత్తశుద్ధి ఇమిడి ఉన్నది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలంగాణ రాష్ర్టాన్ని చూపిస్తే తెలిసిపోతుంది. నేడు తెలంగాణలో సబ్బండ వర్గాల జీవితాల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. ఎనిమిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నేడు దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.
దేశంలోని అనేక రాష్ర్టాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అనుసరిస్తున్నది. తెలంగాణ సాధించిన వ్యవసాయ రంగంలోని ప్రగతి దేశానికే దిక్సూచి అయింది. రాష్ట్రంలోని దళితులు, గిరిజన ప్రజలు సంక్షేమ ఫలాలను అనుభవిస్తున్నారు. వెనుకబడిన తరగతులు ఒక్కో అడుగు ముందుకువేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా మైనారిటీ ప్రజలు ప్రగతిపథంలో దూసుకుపోతున్నా రు. ‘తెలంగాణ వస్తే ఏమొస్తద’ని అడిగినోళ్లకు నేడు తెలంగాణ రాష్ట్ర సాధిస్తున్న అద్భు త విజయాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కవి, గాయకుడు గోరటి వెంకన్న ‘మడుగులన్ని అడుగంటిపోయినయి, బావులు సావుకు దగ్గరయినయి… వాగులు వంకలు ఎండిపోయినయి.. సాకలి పొయ్యిలు కూలిపోయినయి.. పొద్దంతా నడిచేటి పెద్ద బోరు కూడా గుక్కెడు నీళ్లకు నోచుకోకపాయే..’ అని తెలంగాణ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాన్ని, దుఃఖాన్ని పాట రూపంలో ఆవిష్కరించారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్రంలో ఆ పరిస్థితులన్నీ కనుమరుగయ్యాయి. తెలంగాణ పల్లెలు పాడి పంటల సమృద్ధితో సస్యశ్యామలయ్యాయి. ఇంతకన్నా ఇంకేం కావాలి? ‘ఏం వంకర అంటే.. వేలు వంకర అనేటోళ్ల’కు ఇంతకంటే జవాబులు చెప్పాల్సిన పని లేదు.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
-పీఎల్ శ్రీనివాస్
73374 01177