వైద్యరంగంలో వినూత్న ఒరవడులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ లో క్యాన్సర్ చికిత్స కూడా అన్ని నగరాలకు విస్తరిస్తున్నది. ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణతో బాటు వినూత్న సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న చికిత్సను కూడా అందించగలుగుతున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు పూర్వం క్యాన్సర్ చికిత్స థెరపీలు అందించగలిగే వైద్యసంస్థలు హైదరాబాద్కు మాత్రమే పరిమితం. కానీ నేడు అన్ని ప్రధాన నగరాలలోనూ లభిస్తున్నాయి.
అంతర్జాతీయ క్యాన్సర్ డే సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సంరక్షణ అంతరాలను తొలగిద్దామనే నినాదం తెలంగాణ రాష్ట్రంలో కార్య రూపం దాలుస్తున్నది. క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధుల్లో ప్రమాదకరమైనది. ఇటీవల ఈ వ్యాధికి గురవుతున్న వాళ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. అయితే క్యాన్సర్ గురించి పలు ఆరోగ్య, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా.. ప్రజల్లో చైతన్యం అంతంత మాత్రంగానే ఉన్నది.
శరీరంలో ఏదైనా అవయవానికి క్యాన్సర్ సోకితే తొలిదశలో లక్షణాలు అంతగా కనిపించవు. వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి దీని నిర్ధారణ పరీక్షలు కూడా వేర్వేరుగా ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లను ఒకే విధమైన పరీక్షతో తెలుసుకోవడం సాధ్యం కాదు. క్యాన్సర్ అంటువ్యాధి కాదు. అలాగే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా తక్కువే. అయితే రొమ్ము, థైరాయిడ్, పెద్దపేగు, పాంక్రియాస్ క్యాన్సర్లు జన్యుపరంగా సంక్రమిస్తాయి. వీటిని ఫెమిలియల్ క్యాన్సర్లు అంటారు.
దేశంలో ఏటా క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయి. గ్లోబోకాన్ సంస్థ అంచనా ప్రకారం.. గతేడాది ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కారణంగా కోటి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే దేశంలో 11,57,294 కేసులు నమోదు కాగా, వారిలో 7,84,821 మంది మృ త్యువాత పడ్డారు. ఏటా యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (యూఐసీసీ) ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలు, వర్క్షాపులు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించి దానిని అంతమొందించాలన్నదే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. ఏటా ఒక థీమ్ను తీసుకొని ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది ‘close the care gap’ అనే నినాదాన్ని ఎంపిక చేశారు.
శరీరంలో ఏదైనా అవయవానికి క్యాన్సర్ సోకితే తొలిదశలో లక్షణాలు అంతగా కనిపించవు. వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి దీని నిర్ధారణ పరీక్షలు కూడా వేర్వేరుగా ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లను ఒకే విధమైన పరీక్షతో తెలుసుకోవడం సాధ్యం కాదు. క్యాన్సర్ అంటువ్యాధి కాదు. అలాగే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా తక్కువే. అయితే రొమ్ము, థైరాయిడ్, పెద్దపేగు, పాంక్రియాస్ క్యాన్సర్లు జన్యుపరంగా సంక్రమిస్తాయి. వీటిని ఫెమిలియల్ క్యాన్సర్లు అంటారు. కుటుంబంలో ఎవరికైనా ఈ క్యాన్సర్లు ఉంటే వారి పిల్లలకు వచ్చే ప్రమాదమున్నది. క్యాన్సర్ను తొలి దశలో గుర్తించకపోతే ఇతర భాగాలకూ వ్యాపించి, చికిత్సకు సైతం ఏమాత్రం తగ్గుముఖం పట్టదు.కాబట్టి దీన్ని అవగాహనతో ఎదుర్కోవాలి.
ప్రాణాంతకమైన ఈ వ్యాధి నిర్ధారణ కోసం తెలంగాణలో గ్రామీణ స్థాయిలో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తూ ప్రభుత్వం ఈ ఏటి క్యాన్సర్ డే థీమ్ను ఇప్పటికే అమలు పరుస్తున్నది. చికిత్సారంగంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో వినూత్న సాంకేతిక వనరులను సమకూర్చి దవఖానాల్లో క్యాన్సర్ రోగులకు అధునాతన చికిత్సా విధానాలను అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వరంగంలోని ఎమ్ఎన్జే క్యాన్సర్ దవాఖానలో అత్యంత అధునాతన వ్యాధి నిర్ధారణ , చికిత్సా యంత్రాలను సమకూర్చి పేదలకు అందుబాటులోకి తేవడం ద్వారా ఆరోగ్య తెలంగాణ కోసం ఆచరణాత్మక చర్యలు చేపడుతున్నారు.
క్యాన్సర్ కారణాల్లో ఆధునిక జీవన శైలి ప్రధానమైంది. మద్యం, పొగతాగడం,ఆహార పదార్థా ల్లో రంగుల వినియోగం, రసాయనాల వాడకం, హార్మోన్లు అధికంగా వాడటం, అధిక బరువు, కాలుష్యం, క్రిమిసంహారాలు, చికిత్సలో భాగం గా లేదా ప్రమాదవశాత్తు రేడియేషన్కు గురికావడం, తరచూ వేధించే ఇన్ఫెక్షన్లు.. ఇవన్నీ క్యాన్సర్కు కారకాలు. కొన్ని రకాల క్యాన్సర్లను రాకుం డా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు ప్రధాన కారణం హెచ్పీ వీ వైరస్. దీనికి వ్యాక్సిన్ వేసుకుని నివారించవచ్చు. 9 ఏండ్లు పైబడిన బాలికల నుంచి 40 ఏండ్ల మహిళల వరకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అలాగే అండాశయం, గొంతు క్యాన్సర్ రాకుం డా కూడా ఇది అడ్డుకుంటుంది.
క్యాన్సర్ కణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించడం, దానికి ఇతర
అవయవాలకు విస్తరించే గుణం ఉందా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. సర్జరీ, మందులు, థెరపీలు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటాయి. క్యాన్సర్ను జయించడం, త్వరగా గుర్తించడంతో పాటు ఆ
కణితుల పరిమాణం, దశ, గ్రేడింగ్ కూడా చాలా ముఖ్యం.
క్యాన్సర్కు వయసుతో సంబంధం లేదు. అన్ని వయసుల వారూ దీని బారిన పడే అవకాశాలు ఉంటాయి. కానీ చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లు చాలా వరకు పూర్తిగా నయం చేయగలిగినవే. అయితే, వయస్సు పెరిగేకొద్ది క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువ. ఈ సమయంలో వచ్చే క్యాన్సర్ల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.
అందుకే క్యాన్సర్ చికిత్సను కూ డా వయస్సును బట్టి నిర్ధారిస్తారు. క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేయడానికి కీమోథెరపీ, రేడియోథెరపీలతో పాటు ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో చేసే కీహోల్ సర్జరీలు కూడా నేడు అందుబాటులో ఉన్నాయి. సర్జరీ తర్వాత రేడియో, కీమో, హార్మోన్ థెరపీ లాంటివి చేసినా, లేక థెరపీల తర్వాత సర్జరీ చేసినా చికిత్స అంతటితో అయిపోయిందని భావించరాదు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
క్యాన్సర్ కణం శరీరంలో ఎక్కడుందనే విషయం తెలుసుకోవడం కష్టం. ఏ అవయవానికి సోకిందనే అనుమానం ఉంటే దానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, ఎఫ్ఎన్ఏ టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్-రే, సీటీ స్కాన్, యంఆర్ఐ, పీఈటీ స్కాన్ వంటివి అవసరాన్ని బట్టి చేస్తారు. అయితే సర్వైకల్ క్యాన్సర్ను పాప్స్మియర్ ద్వారా ముందుగా గుర్తించవచ్చు.
నిమ్స్, బసవ తారకం, ఎమ్ఎన్జే క్యాన్సర్ దవాఖానలతోపాటు హైదరాబాద్ నగరంలోని కార్పొరేట్ దవాఖానలలో అత్యాధునిక టెక్నాల జీలతో కూడిన క్యాన్సర్ చికిత్సలు అందుబాటు లో ఉన్నాయి. సుమారు 20 ప్రత్యేక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు హైదరాబాద్లో క్యాన్సర్ రోగుల చికిత్సకు సేవలందిస్తున్నాయి. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ లాంటి సూపర్ స్పెషాలిటీ సంస్థలు తమ పరిధిని విస్తరిస్తున్నాయి. హెల్త్ సిటీ ఏర్పాటవుతున్న వరంగల్తో బాటు ఖమ్మం, కరీంనగర్, నల్గొండల్లో కూడా క్యాన్సర్ చికిత్సకు సదుపాయం ఉన్నది.
(వ్యాసకర్త : కడియం ఫౌండేషన్ చైర్ పర్సన్ )
-డాక్టర్ కడియం కావ్య