తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాతృమూర్తి వెంకటమ్మ జన్మస్థలం వర్తమానంలో కోనాపూర్గా పరిచయంలో ఉన్న ఒకప్పటి పోసానిపల్లె. కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో బీబీపేట మండలం ఉన్నది. కేసీఆర్ తండ్రి రాఘవరావు ఊరు ముస్తాబాద్ మండలం మోహినికుంట. సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నది. తాతా స్వస్థలం పరిధిలో ఆల్రెడీ కేటీఆర్ వరుసగా అయిదోసారి ప్రాతినిధ్యానికి ప్రజా తీర్పు కోరుతున్నారు. అమ్మ పుట్టిన పల్లె అంతర్బాగంగా ఉన్న కామారెడ్డి నుంచి ప్రాతినిధ్యానికి కేసీఆర్ శుభారంభం పలుకుతున్నారు.
భారతరాష్ట్రసమితి తెలంగాణ ప్రభుత్వ నాయకత్వ శిఖరాలకు భౌగోళికంగానూ సరిహద్దుల్లో ఉన్న కామారెడ్డి-సిరిసిల్ల మధ్య భావోద్వేగ పేగు బంధమిది. బీబీపేట (కామారెడ్డి) – గంభీరావుపేట (సిరిసిల్ల) మధ్యలో 1945-51 మధ్యకాలంలో వెలసిన ఎగువ మా నేరు ప్రాజెక్టు నిర్మాణం వల్ల నాడు భూ నిర్వాసితులలో కేసీఆర్ మాతృమూర్తి కుటుంబమూ ఒకటి. ఈ బంధాలు, అనుబంధాలు, రకరకాల జ్ఞాపకాల దొంతరలు గుండెలను తాకుతాయి. ఆసాంతం పేగు బంధం అల్లుకుపోయిన కామారెడ్డి-సిరిసిల్ల ఇక సుస్థిర అభివృద్ధికి కారిడార్ కాబోతున్నది!
కామారెడ్డి సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్నది. ఎందుకంటే కేసీఆర్ ప్రాతినిధ్యం అంటే రొటీన్గా, సాదాసీదాగా, చప్పచప్పగా ఉండదు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్నారంటే ఆ నియోజకవర్గంలో తరతరాల దారిద్రం శాశ్వతంగా తొలగుతుంది. సదరు సెగ్మెంట్ బంగారు తాంబాలంగా అవతరిస్తుంది.
అందుకే కేసీఆర్ పోటీని కోరుకోని నియోజకవర్గం ఉండదు. ఇపుడు ఊరూవాడా వాయువేగానికి మించిన మనోవేగంతో సరాసరి కామన్ పబ్లిక్లో కామారెడ్డి టాక్ ఆఫ్ ది స్టేట్ అయింది. గత, వర్తమాన చరిత్ర మేరకు కేసీఆర్ ఎక్కడ నిలబడితే అక్కడ ఓ సంచలనమే. ఆ సెగ్మెంట్ సస్యశ్యామలమే. కేసీఆర్ అంటే అల్టిమేట్ బ్రాండ్. అపోజిషన్లో ఎవరున్నా జనం నజర్ అంతా ఆ ట్రెండ్ సెట్టర్ పర్సనాలిటీ వైపే.
కేసీఆర్ ప్రాతినిధ్యం ఒక మహాద్భాగ్యమనే ఖ్యాతి ఇప్పటిది కాదు. 1980 దశకంతోనే ఆ ఒరవడి ఏర్పడింది. పరాయి పాలకుల ఏలుబడిలోనే సిద్దిపేటకు మౌలిక సౌలభ్యాల సద్ది కట్టిన సమర్థులు కేసీఆర్. లోకమే ఈర్ష్య పడేలా సిద్దిపేట బాగుపడటానికి అపుడే అంకురార్పణ జరిగింది. చెంబెడు నీటికోసం బెంబేలెత్తిన కాలంలో ఎక్క డో ఉన్న ఎల్ఎండీ నుంచి మానేరు నీటితో సిద్దిపేట కడుపు నింపారు. అప్పటి ఆ ఆలోచన డిజైన్ నేడు దేశానికే రోల్మాడల్ అయింది.
అప్పటిదాకా గజిబిజిగా ఉన్న గజ్వేల్ కేసీఆర్ ప్రాతినిధ్య భాగ్యం వల్ల డెవలప్ మెంట్లో టాప్గేర్తో పరుగులు తీసింది. చూస్తున్నంతసేపు చూడబుద్ధి అయ్యేలా గజ్వేల్ సెటిలైన తీరు మన కండ్ల ముందే ఉన్నది. ఇపుడు కామారెడ్డికీ ఆ కళ రాబోతున్నది. బీఆర్ఎస్ పోటీదారుల జాబితా వెల్లడితోనే కామారెడ్డి పురోగమన యోగానికి ము హూర్తం ఖరారైంది. దేహం బక్కపల్చటిదే అయి నా దేశమే తన వెంట నడిచొచ్చే సమ్మోహన శక్తిసంపన్నులైన కేసీఆర్ మూలాలు ఉన్నది కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లోనే. కేసీఆర్ మాతృమూర్తి వెంకటమ్మ జన్మస్థలం పోసానిపల్లె(కోనాపూర్). సిరిసిల్ల సెగ్మెంట్లోని మోహినికుంట వాస్తవ్యులైన కల్వకుంట్ల రాఘవరావుతో వెంకటమ్మ వివాహ బంధం నేపథ్యంలో రాఘవరావు కోనాపూర్లో స్థిరపడ్డారు. వీరికి కమలమ్మ, విమల మ్మ, లలిత, లీలావతి, సకలమ్మ, రంగారావు లు పోసానిపల్లెలో జన్మించారు.ఎగువ మానేరుడ్యాం లో ఆస్తులు ముంపునకు గురవడంతో సిద్దిపేట సెగ్మెంట్లోని చింతమడకకు వారి కుటుంబం మారింది. చింతమడకలోనే కేసీఆర్ జన్మించారు.
తన నానమ్మ గ్రామం కోనాపూర్ను కేటీఆర్ నిరుడు మే 10న సందర్శించారు. నాయనమ్మ వెంకటమ్మ పేరిట కార్పొరేట్ను తలదన్నే పాఠశాలను స్వచ్ఛందంగా కట్టించే పనులకు ఆరోజు శ్రీకారం చుట్టారు. ఊరికి కళ ఉట్టిపడేలా ఆ స్కూలు భవంతి ప్రారంభానికి ముస్తాబైంది. అంతేకాదు వంతెన, జీపీ బిల్డింగ్, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ రూ.10 కోట్ల అంచనా వ్యయం తో అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ కామారెడ్డిలో క్షేత్రస్థాయి కార్యకలాపాలలో శ్రేణులతో కలి సి స్వయంగా పాల్గొన్నారు. ఉద్యమాన్ని రాజేయడంలో కామారెడ్డికి తాను బ్రిగేడియర్ గానూ వ్యవహరించారు. తద్వారా టీఆర్ఎస్ ఆవిర్భవించిన 2001లోనే లోకల్ బాడీ ఎన్నికల్లో సింహభాగం మండల పరిషత్లలో గులాబీ జెండా ఎగిరింది. జెడ్పీ చైర్మన్ పీఠం పార్టీ సొంతమైంది.
స్వరాష్ట్రం, స్వయంపాలనలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కామారెడ్డిని జిల్లా చేస్తూ కొత్త హంగులు ఏర్పాటు చేశారు కేసీఆర్. ఆ మేరకు కామారెడ్డి కలెక్టరేట్, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాలను 2021 జూన్ 20న సీఎం ప్రారంభించారు.ప్రభుత్వం రెండోసారి రెన్యువల్కు ముందు 2018 ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన మెడికల్ కాలేజీ మంజూరు హామీని కేసీఆర్ అమలు చేసి చూపారు.
కామారెడ్డి సర్వతోముఖాభివృద్ధికి మరింత వడివడిగా అడుగులు పడుతాయని కేసీఆర్ పోటీ చేయనున్న తరుణంలో స్థానిక ప్రజల్లో కొంగొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేయకుండా ఏకగ్రీవం గా ఎన్నుకొని గౌరవభావం చా టాలనే అభిప్రాయాలూ ఉదయిస్తున్నాయి. కేసీఆర్ ప్రాతినిధ్యం ఫలితంగా ముఖ్యంగా సత్వర సరిహద్దుల్లోని కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలు వివిధ రంగాల్లో మరింతగా పురోగమిస్తాయి.
-ఇల్లెందుల దుర్గాప్రసాద్
9440850384