తెలంగాణలో ఏపల్లె చూసినా పచ్చగా కనిపిస్తున్నది. ఎటుచూసినా పచ్చని పొలాలు.. భూమికి బరుయ్యేంతగా పండుతున్న పంట. నీళ్లకు రందిలేదు. సమైక్య రాష్ట్రంలో అన్నివిధాలుగా దగాకు గురై శిథిలమైన తెలంగాణ పల్లెల్లో నేడు కొత్త కాంతులు కనిపిస్తున్నాయి. స్వరాష్ట్రంలో ప్రభుత్వ కృషితో పల్లెలు ప్రగతి బాటన పయనిస్తున్నాయి. పట్టణాలకు దీటుగా మౌలిక వసతులు సంతరించుకుంటున్నాయి. నేడు పల్లెలు నివాసయోగ్యంగా మారాయి. పల్లె ప్రజల జీవన ప్రమాణాలు మారాయి. రైతులు, కూలీలు, వలస వచ్చిన వారికి తెలంగాణ పల్లెల్లో ఉపాధి దొరుకుతున్నది. దీంతో పల్లెసీమల్లో ఊరంతా కలిసి ఊరుమ్మడి పండుగలు చేసుకుంటున్నారు.
రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా ఆ యాసంగిలో 54 లక్షల ఎకరాల్లో వరి సాగైందంటేనే అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో సగం జనాభాకు అన్నం పెట్టే స్థాయికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. రైతుకు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఎకరాకు రెండు పంటలకు కలిపి పది వేలు రైతుబంధు ఇస్తున్నది. 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్నది. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలను ప్రోత్సహిస్తున్నది.
తెలంగాణ గ్రామాల్లో పంటల దిగుబడి పెరు గడంతో పండుగ వాతావరణం కని పిస్తున్నది. స్వరాష్ట్రం సాధించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోవడంతో బీడు భూములన్నీ పంటలతో కళకళలాడుతున్నాయి. దీంతో బొడ్రా యి ప్రతిష్ఠాపన…పోచమ్మ బోనాలు, బీరప్ప, పెద్దమ్మ పెద్దిరాజు, మహంకాళి మాత, దుర్గమ్మ, రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ పండుగలతో పాటు కందూరు ఇలా అన్ని రకాల గ్రామ దేవతల పం డుగలతో పల్లెలు ఫుల్జోష్లోఉన్నాయి. ఏ పల్లె చూసినా ఏదో ఒక పండుగతో ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. లక్షలు వెచ్చించి దేవాలయాలు నిర్మిస్తున్నారు. ఇంటి ఆడపడుచులను, బంధుమిత్రులను పిలిచి జోరుగా పండుగలు నిర్వహిస్తున్నారు. ఒకనాడు కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణ పల్లెల్లో ఇవాళ ప్రశాంత వా తావరణం నెలకొన్నది. బతుకు జీవనంకోసం వలస పోయి న వారంతా తిరిగి పల్లెలకు తిరిగి వచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పల్లెల ముఖ చిత్రాలే మారిపోయాయి. నాడు పట్టణాల్లో ఉండాలని కోరుకున్న వారంతా ఇవాళ పల్లెల్లో నివసించడానికి ఆసక్తి చూ పుతున్నారు. దీనికంతటికి కారణం ప్రశాంతత.. మంచి వాతావరణం..మంచి రోడ్లు. .పచ్చదనం..తాగునీరు, కరెంట్కు ఢోకాలేక పోవడం..జీవన వ్యయం తక్కువగా ఉండ డం.. చెప్పుకుంటూ పోతే అనేక సానుకూలతలు ఉన్నాయి.
గతంలో ఇంతగా ఎప్పుడు పల్లెల్లో ఆశావహ దృక్పథం కనిపించలేదు. గడిచిన తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ పల్లెల అభివృద్ధ్దికి ప్రత్యేక చొరవ చూపడంతో ఇవాళ దేశంలోనే ఆదర్శ గ్రామాలు గా తీర్చిదిద్దబడ్డాయి. నాటి సమైక్య రాష్ట్రంలో ఉ న్న ఊర్లో పని దొరకక ఇతర రాష్ర్టాలకు, దుబా యి తదితర ప్రాంతాలకు వలస వెళ్లి బతుకులు ఎల్లదీశారు. తమ కుటుంబ సభ్యులను విడిచి ఏండ్ల పాటు బతుకు దెరువు కోసం వెళ్లేవారు. కాళేశ్వరం జలాలతో పుష్కలంగా సాగునీరు అందుబాటులోకి వచ్చింది. పంటలు పండుతున్నాయి. వివిధ కులవృత్తులకు సీఎం కేసీఆర్ చేయూతనిస్తున్నారు. దీంతో సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంతో ఉన్నారు.
ఒకనాడు తెలంగాణ పల్లెల్లో కరువు కాటకా లు, రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, దుర్భ ర పరిస్థితులు నెలకొని ఉండేవి. బతుకు బండిని లాగించటానికి జనం అష్టకష్టాలు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో అవన్నీ దూరమయ్యా యి. పల్లెలు ఇప్పుడు నూతన ఓరవడిని సృష్టిస్తున్నాయి. తమ కుటుంబంతో పాటు గ్రామం బా గుండాలి..పంటలు బాగా పండాలని ఇవాళ రాష్ట్రంలో ఏపల్లెలో చూసినా గ్రామ దేవతల పండుగలు ప్రజలంతా కలిసి ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు. వారం రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. చివరి రోజు పెద్ద ఎత్తున దావతులతో ఆత్మీయత వెల్లివిరుస్తున్నది. బంధువుల రాకతో ఆనందం నెలకొంటున్నది. గ్రామాల్లో వారి కుల దేవతల పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
కొన్ని గ్రామాల్లో కొత్తగా ఆలయాల నిర్మాణం చేపడుతున్నారు. ఊరు ఊరంతా ఒకే దగ్గర గుడి కట్టి పండుగ నిర్వహిస్తున్నారు. ఇక యాసంగి ధాన్యం చేతికి రాగానే పొలాల వద్ద మైసమ్మ పండుగకు చేస్తున్నారు. రైతులు పండించిన ధాన్యం అమ్మవారి ముందు పెట్టి పండుగలను చేపడుతున్నారు. మరి కొందరు పొలి చేసుకుంటున్నారు. మరి కొంతమంది రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద కందూరు చేసుకుంటున్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు పండుగలను నిర్వహించుకుంటున్నారు. అంతిమంగా ప్రతి ఒక్కరిలో భక్తి భావం పెరిగింది.
నాడు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆ పరిస్థితులు లేవు. పల్లె ప్రగ తి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లె లు పచ్చని చెట్లతో పచ్చని వాతావరణం తో స్వాగతం పలుకుతున్నాయి. సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేసి గోదావరి నీళ్లు బీడు భూములకు మళ్లించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టడంతో పుష్కలంగా సాగు నీరు అందుతున్నది. ఎన్నడూ లేనంతగా సాగు విస్తీర్ణం పెరిగింది.వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే అన్ని వర్గాలకు ఉపాధి దొరుకుతుందన్నది తెలంగాణ లో నిజమైంది. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా ఆ యాసంగిలో 54 లక్షల ఎకరాల్లో వరి సాగైందంటేనే అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో సగానికి అన్నం పెట్టే స్థాయికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. రైతుకు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభు త్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఎకరాకు రెం డు పంటలకు కలిపి పది వేలు రైతుబంధు ఇస్తున్నది. 24గంటల నాణ్యమైన ఉచిత విద్యు త్, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్నది. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలను ప్రోత్సహిస్తున్నది. ప్రతి వ్యవసాయ క్లస్టర్కు ఒక రైతు వేదికను ఏర్పాటు చేసి రైతులకు నూతన సాగు విధానాలను ప్రభుత్వం వివరిస్తున్నది.
విత్తనం నాటిన నాటినుంచి పంట చేతికొచ్చి, మార్కెట్లో అమ్మేవరకు అంతా తానై ప్రభుత్వం చూసుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే రైతు ముంగిట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నది. దీంతో రైతులంతా ఖుషీగా ఉన్నారు. గతంలో ఎకరానికి ఐదారు లక్షలు ఉన్న భూముల ధరలు ఇవాళ అమాంతం పెరిగాయి. ఫలితంగా రైతులు రాజులవుతున్నారు.
గ్రామాల్లోని కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నది. గొల్లకుర్మలకు గొర్రెల పంపి ణీ, మత్స్యకారులకు వం దశాతం సబ్సిడీపై చేపల సరఫరాతో ఉపాధి దొరుకుతున్నది. మరోవైపు అ ణగారిన వర్గాలుగా ఉన్న దళితులు దళిత బంధు తో నేడు ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమి జరుగుతుందో అన్న ప్రశ్నలకు స్వరాష్ట్రంలోని నేటి పల్లెలే ఉదాహరణగా నిలుస్తున్నాయి.
కత్తుల శ్రీనివాస్రెడ్డి
91827 77027