నినాదాలను విధానాలుగా మార్చి చరిత్ర సృష్టించడం చాలా అరుదు. మన దేశంలో నాలుగైదు సందర్భాల్లో తప్ప అటువంటిది జరగలేదు. సమకాలీన చరిత్రలో కేసీఆర్ ఇదిచేసి చూపిస్తున్నారు. తెలంగాణ వ్యతిరేకులతో కూడా నాడు ‘జై తెలంగాణ’ అనిపించారు. తెలంగాణ రాష్ట్రమొస్తే ఎలా పరిఢవిల్లుతుందో పదేండ్ల కిందటే చెప్పారు. రాష్ట్రం వచ్చాక ఆ నినాదాల్నే విధానాలుగా అమలుచేస్తున్నారు. దేశ చరిత్రలో తెలంగాణను సుస్థిరం చేశారు.
రైతు ఆత్మహత్యలతో తల్లడిల్లిన తెలంగాణ నేలపై ఇవాళ వ్యవసాయం పండుగలా ఎలా మారింది? ప్రవాస తెలంగాణీయులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, పీజీలు, పీహెచ్డీలు చేసిన వాళ్లు కూడా నేడు వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవటాన్ని మన కళ్లముందు చూస్తున్నాం. వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా అబ్బురపడే స్థాయిలో ఎలా అభివృద్ధి చెందాయో చూస్తున్నాం. తెలంగా ణ ఉద్యమంలో పలికిన నినాదాలు స్వరాష్ట్రంలో విధానాలుగా మారాయి. ‘తెలంగాణలో విద్యుత్ రంగం ఎలా మారిపోయింది. కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువులకు ఎలా మహర్దశ వచ్చింది. తాగునీటికి తండ్లాట పడ్డ పల్లె గుమ్మంలోకి మిషన్ భగీరథ పేరుతో నీళ్లెలా వస్తున్నాయి. హైదరాబాద్ సహా ప్రధాన నగరాలు, పట్టణాలు ఎలా ఉన్నా యి. విధ్వంసానికి లోనైన నాటి పల్లెల పురోభివృద్ధి ఎలా ఉంది’ అన్నది అవలోకనం చేసుకుంటే మన కే ఆశ్చర్యం కలుగకమానదు. అంటే తెలంగాణ ఉద్యమంలో ఎగసిన ప్రతి నినాదం నేడు సాకారమై మన కండ్లముందు నిలిచింది. అందుకే బీఆర్ఎస్ ఆవిర్భావ అనంతరం ప్రతీ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమస్ఫూర్తి గురించి గుర్తుచేస్తున్నారు.
తెలంగాణ వ్యతిరేకులతో కూడా నాడు ‘జై తెలంగాణ’ అని అనిపించినట్టే, నేడు రైతు వ్యతిరేకులతో కూడా ‘జై కిసాన్’ నినాదాన్ని పలికించాలని కేసీఆర్ చెప్తున్నారు. దేశంలోని రైతు నేతలంతా ఐక్య సంఘటన కట్టి, ప్రతినబూనాల్సిన అవసరాన్ని నొక్కిచెప్తున్నారు. ఈ దేశ రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం. రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటదని, వ్యవసాయం బాగుంటేనే సమాజం బాగుపడతదని చెప్తున్నారు. అం దుకే కేసీఆర్ ఇస్తున్న ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదానికి యావత్ దేశం మద్దతు ప్రకటిస్తున్నది. కర్ణాటక, తమిళనాడు, యూపీ తదితర రాష్ర్టాలలోని రాజకీయపక్షాలు ఇప్పటికే కేసీఆర్తో భేటీ కాగా ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ తొలి సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవత్సింగ్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్తోపాటు అన్ని రాష్ర్టాల వామపక్ష పార్టీల ముఖ్యనేతలు హాజరవుతున్నారు. బీఆర్ఎస్ రైతు అనుకూల నినాదాలు.. భారతావనిలో విధానాలుగా అమలయ్యే రోజు తప్పక వస్తుంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలే కీలకం. ఆ ఎన్నికలను నినాదాలే ప్రభావితం చేస్తాయి. ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయపార్టీలు రకరకాల నినాదాలు ఇస్తాయి.
అధికారంలోకి రావడానికి పార్టీలకు నినాదాలు ఎన్నికల అస్ర్తాలుగా పనిచేస్తాయి. గత 75 ఏండ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో పలువురు నాయకులు, పలు పార్టీలు అనేక నినాదాలిచ్చాయి. కొన్ని మాత్రమే బహుళ ప్రజాదరణ పొందగా, చాలావరకు నినాదాలు పెద్ద ప్రభావం చూపలేకపోయాయి. ఇండియా-పాకిస్థాన్ యుద్ధ సమయంలో భారత సైన్యానికి మానసికంగా ైస్థెర్యం ఇచ్చేందు కు, దేశంలో ఆహారధాన్యాల కొరతను తీర్చేలా రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు నాటి ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి ఇచ్చిన నినాదం ‘జై జవాన్-జై కిసాన్’ గొప్ప ఉత్తేజాన్ని కలిగించింది. ఆ తర్వాత కాలంలో, దేశంలో పేదరికాన్ని తరిమికొట్టేందుకు ఇందిరా గాంధీ.. ‘గరీభీ హటావో’ నినాదం ఇచ్చా రు. అది కూడా విస్తృత ప్రజాదరణ పొందింది. ప్రస్తుత ప్రధాని మోదీ కూడా ప్రజానీకాన్ని ఆకర్షించటానికి అచ్చేదిన్, మేకిన్ ఇండియా అంటూ పలు నినాదాలు ఇచ్చారు. కానీ, మాటల్లో తప్ప అవి చేతల్లో సాకారం కాకపోవటంతో, ప్రజలపై వాటి ప్రభావం అసలే లేదని చెప్పవచ్చు.
దేశ చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ లేనివిధంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ ఇచ్చిన పిలుపు ఇప్పుడు యావత్భారతాన్ని ఆకర్షిస్తున్నది. మనది ఇప్పటికీ వ్యవసాయాధారిత దేశ మే. జనాభాలో సగానికిపైగా సాగుపై ఆధారపడిన వారే. కాబట్టే, కేసీఆర్ ఇచ్చిన నినాదం రైతులతోపాటు అన్ని వర్గాలనూ అమితంగా ఆకట్టుకుంటున్నది. రైతులు బీఆర్ఎస్ పార్టీ వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. చట్టసభల్లోకి రైతులు ఎందు కు అడుగిడకూడదు? తమ పంట ఉత్పత్తుల ధరలను తామే ఎందుకు నిర్ణయించుకోకూడదు? అన్న కేసీఆర్ ప్రశ్నలు కొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. అధికారంలోకి రావటానికి తమను ఒక మెట్టుగా ఉపయోగించుకున్న నేతలను, పార్టీలనే చూసిన రైతులు, రైతు సంఘాలు.. తొలిసారి తామే అధికారంలోకి ఎందుకు రాకూడదంటున్న కేసీఆర్ను చూసి గొప్ప ఆత్మవిశ్వాసం పొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ ఖాయ మని ఘంటాపథంగా చెప్ప వచ్చు.
-వెంకట్ గుంటిపల్లి , 94949 41001