గత కొద్ది రోజుల నుంచి వివిధ పార్టీలకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు చాలామంది స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీల్లో ఉన్నత స్థాయిల్లో పనిచేసిన వారంతా ఆ పార్టీలను ఎందుకు వీడుతున్నారు? వారు చేరడానికి బీఆర్ఎస్నే ఎందుకు ఎంచుకుంటున్నారు? వారంతా కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే ఎందుకు కోరుకుంటున్నారు? జాతీయ పార్టీలను, తమ అనుభవాలన్నీ వదిలిపెట్టి ఏ లక్ష్యం కోసం బీఆర్ఎస్లో చేరుతున్నారు? ఎన్నికల వేళ ఈ చేరికలు దేనికి సంకేతం? అనే కోణంలో తెలంగాణ బుద్ధిజీవులు, మేధావులు చర్చించుకుంటున్నారు.
బీఆర్ఎస్లో చేరుతున్న నేతలంతా కూడా నాలుగైదు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నవారు. అనేక పదవులను అనుభవించిన వారు. గత పాలనలను చూసి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనను చూసి మంచి, చెడు బేరీజు వేసుకునే ఈ చేరికలు జరుగుతున్నాయని స్పష్టమవుతున్నది. ఈ చేరికలను ఏదో పార్టీల ఫిరాయింపుల్లా, రాజకీయ అవసరాలు, అవకాశాల కోణంలో చూస్తే దానంత మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఓ సుస్థిర ప్రభుత్వం కోసం, సమర్థవంతమైన పాలన కోసం, నమ్ముకున్న జనాల్ని ఉద్ధ్దరించడం కోసం ఈ చేరికలు జరుగుతున్నాయన్నది సుస్పష్టం. జీవితంలో ఎన్ని పదవులు అనుభవించామన్నది ముఖ్యం కాదు…నమ్ముకున్న వారికోసం ఏం చేశామన్న అవలోకనాల అనంతరమే జరుగుతున్న చేరికలు. మంత్రులుగా పని చేసిన వారు, రాష్ట్రం కోసం ఉద్యమించిన వారు సుస్థిరత కోసం, తెచ్చుకున్న తెలంగాణ బలంగా ఉండడం కోసం ఈ చేరికలు జరుగుతున్నాయని స్పష్టంగా తెలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం కావాలని, రావాలని తొలిదశ ఉద్యమం నుంచి ఆకాంక్షించి వేర్వేరు వేదికల నుంచి తమ గళం వినిపించిన వారు కొందరు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్తో పనిచేసి ఇతర పార్టీల్లో చేరిన వారు కొందరైతే, పార్టీలు పెట్టి మరీ ఉద్యమించిన వారు మరికొందరు. వీరంతా నేడు మూకుమ్మడిగా భారత రాష్ట్ర సమితిలో చేరి గులాబీ కండువాలు కప్పుకుంటున్న తీరును తెలంగాణ సమాజం హర్షిస్తున్నది.
అనేక కొట్లాటలు, పోరాటాలు, లాబీయింగ్, రాజకీయ సంఘర్షణల అనంతరం కేసీఆర్ తెచ్చిన తెలంగాణ సుస్థిరంగా ఉండాలన్నది తెలంగాణ బుద్ది జీవుల ఆకాంక్ష. అందుకు అనుగుణంగా తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చి దేశంలో నంబర్వన్ రాష్ట్రంగా నిలిపారు కేసీఆర్.
ఈ క్రమంలోనే తెలంగాణలో రాజకీయ అస్థిరత సృష్టించేందుకు పలు రూపాల్లో కుట్రలు జరుగుతున్నాయి. అందుకే బీఆర్ఎస్కు సొంత మెజారిటీ ఉన్నా తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి అంతా కలిసి రావాలని అనేక సందర్భాల్లో సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సుస్థిర తెలంగాణ బాగు కోసం రాజకీయ పునరేకీకరణ జరుగాలని కేసీఆర్ పదే పదే చెప్తున్నారు.
అయినప్పటికీ రాజకీయ అస్థిరత్వం సృష్టించాలని కుట్రలు నాడు నేడు కూడా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. ఒక దశలో రాష్ట్రపతి పాల న విధించే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయినా రాజకీయ పునరేకీకరణ జరుగుతూ వస్తున్నది. 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతునిస్తూ వస్తున్నది మజ్లిస్ పార్టీ. 2014 శాసన సభలో టీఆర్ఎస్ బలం 63. మజ్లిస్ పార్టీ మద్దతు ఎలాగు ఉన్నది. ఆ తర్వాత కేసీఆర్ పాలన చూసి చాలామంది బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకంగా 88 సీట్లు గెలిచింది. అయినా పలు పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు.
ఈ క్రమంలో కేసీఆర్ తను ఇచ్చిన మాట ప్రకారం పార్టీని నమ్ముకున్న ప్రతి సిట్టింగ్ ఎమ్మెల్యేకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన ప్రతి శాసన సభ్యుడికి మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించారు. అప్పుడు ఇప్పుడూ చేరినవారితో పా టు, చేరబోతున్న వారూ, తమ నియోజకవర్గ, రాష్ట్ర అభివృద్ధికోసం మాత్రమే బీఆర్ఎస్లో చేరుతున్నారు.
తన రాజనీతి, చాణక్యంతో కుట్రలను ఓ వైపు పసిగడుతూనే బాగుపడుతున్న తరుణంలో బతికి చెడకూడదని మరో వైపు హెచ్చరిస్తూ ఆ కుట్రలను ఛేదిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ నాయకత్వాన్ని అస్థిర పరిచి అభా సుపాలు జేసేందుకు ఇప్పటికీ కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల బీఆర్ఎస్లో చేరిన మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు నాగం జనార్ధన్ రెడ్డి, చంద్రశేఖర్, విష్ణువర్థన్ రెడ్డి సహా అనేక మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, ఉద్యమకారులు పార్టీ కం డువాలు కప్పుకుని ఇప్పుడు స్వేచ్చాయుత వాతావరణం లో ఉన్నామని ఊపిరి పీల్చుకుంటున్నారు. తెలంగాణ కోసం పోరాడిన దాసోజు శ్రావణ్, చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణా రెడ్డి, దరువు ఎల్లన్న, ఏపూరి సోమన్న లాంటి కరుడు గట్టిన ఉద్యమకారులు బీజేపీ, కాంగ్రెస్ల్లో ఇమడలేకపోయారు. కేసీఆర్ పాలన, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్లో చేరారు.
ఎంతో రాజకీయ అనుభవం ఉన్న పొన్నాల లక్ష్మయ్య సొంత పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఏడు పదుల వయసులో పదవులతో పనిలేకుండా నాడు – నేడు అనే ఒకే ఒక్క ట్యాగ్లైన్లో సమగ్ర విశ్లేషణ జరిపి మేధోమథనం అనంతరం పార్టీ మారాలని నిర్ణయం తీసుకుని సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
అలాగే మరో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి వైద్యారోగ్యమంత్రి సహా పలు కీలక శాఖల్లో పని చేశారు. ఆయన కూడా నాటి ఏపీ, నేటి తెలంగాణను, రాజకీయ స్థిరత్వాన్ని బేరీజు వేసుకుని బీఆర్ఎస్లో చేరారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ప్రముఖులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఆయా పార్టీలను విడిచిన ఉద్యమకారులది ఒక్కొక్కరిది ఒక్కో అనుభవం. సుస్థిర తెలంగాణాభివృద్ధ్ది కోసం సదరు నేతలంతా కేసీఆర్ దరికి వస్తున్నారు.
ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణాన్ని తెలంగాణ సమాజం దగ్గరగా చూస్తున్నది. అందుకే ఇప్పుడు కూడా ఏదో ఎన్నికలు, ఓట్లు , సీట్లు అని కాకుండా సుస్థిర ప్రభుత్వం కోసం మరో రాజకీయ పునరేకీకరణ జరగుతున్నది.
-వెంకట్, గుంటిపల్లి
94949 41001