రాజస్థాన్ పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి అక్కడి చారిత్రాత్మక కోటలు, రాజ భవనాలు. దేశంలోనే అత్యంత సుందరమైన రాజప్రాసాదాలు రాజస్థాన్ సొంతం. భారతదేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 10.40 శాతం కలిగిన అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. రాష్ట్రంలో స్త్రీల అక్షరాస్యతా శాతాన్ని పెంచే దిశగా జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా జైసల్మేర్ కు 40 కి.మీ దూరంలోని సల్ఖా గ్రామంలో అత్యద్భుతమైన నిర్మాణ శైలితో ఏర్పాటైనదే రాజకుమారి రత్నావతి పాఠశాల.
పర్యావరణానుకూలంగా నిర్మించబడిన ఈ పాఠశాల ప్రాంగణం మొత్తం మూడు వైవిధ్యమైన భవనాల కలయికగా ఉంటుంది. మొదటిది జ్ఞాన కేంద్రం, రెండవది – మేధా హాల్, మూడవది మహిళా సహకార భవనం. ప్రధాన పాఠశాల భవనమైన జ్ఞాన కేంద్రం ద్వారా స్థానిక మహిళలకు సాధికారతను కల్పించి వారిని విద్యావంతులను చేస్తారు.
అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందిన సీఐటీటీఏ స్వచ్ఛంద సంస్థ ద్వారా రాజకుమారి రత్నావతి పాఠశాల నిర్మించబడింది. ఏసీ భవనంలా విద్యార్థులకు చల్లటి వాతావరణం ఉండేలా రాజకుమారి రత్నావతి పాఠశాలను నిర్మించారు ‘డయానా కెల్లాగ్’ అనే మహిళా వాస్తుశిల్పి. ఈ పాఠశాల నిర్మాణానికి జైసల్మీర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మన్వేందర్ సిం గ్ 22 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు.
అండాకారంలో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను సైతం తట్టుకునేలా అత్యంత అద్భుతమైన నిర్మాణ శైలితో మిగతా పాఠశాలల కంటే పూర్తి భిన్నంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉన్నప్పటికీ ఈ పాఠశాలలో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ లేకపోయినప్పటికీ ప్రత్యేకంగా చేపట్టిన నిర్మాణ శైలి కారణంగా తరగతి గదుల్లో ఉష్ణోగ్రత ఎప్పటికీ చల్లగా,మితంగా ఉంటుంది. ఇది సాంప్రదాయ నిర్మాణ శైలితో పాటు సౌర ఫలకాలను, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థను ఉపయోగించడం ద్వారా ఉష్ణోగ్రత స్థిరంగా ఉండేలా నిర్మించిన భవనమిది.
ఈ పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి తరగతికి గరిష్టంగా 40 మంది విద్యార్థులకు పరిమితం చేయడంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 400 మాత్రమే. ఈ పాఠశాల సీఐటీటీఏ సౌజన్యంతో పూర్తి ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహించబడుతున్నది.
ఈ స్ఫూర్తిదాయక పాఠశాల వాస్తుశిల్పి డ యానా కెల్లాగ్ అనే అమెరికన్ ఆర్కిటెక్ట్. ఒక మహిళగా తన స్వీయ అనుభవాలను జోడించి ఆమె ఈ పాఠశాలను స్త్రీ-కేంద్రీకృతంగా బలమై న స్థానిక సంస్కృతి చిహ్నాలు ప్రతిబింబించేలా మూడు అండాకార నిర్మాణాలతో రూపొందించారు. ఈ భవనాల మరో ప్రత్యేకత ఏమిటంటే ఇవి సాంప్రదాయ రాజస్థానీ వాస్తుకళకు అద్దం పడుతూనే ఆధునిక భవిష్యత్తు నిర్మాణ శైలికి ఉదాహరణగా నిలుస్తున్నవి. ఒక సమర్థవంతమైన డిజైన్ను రూపొందించడానికి ఆ ప్రాంత వాతావరణం, చరిత్ర, సంస్కృతి, స్థలాకృతి, స్థానిక భాష గురించి లోతైన అవగాహన అత్యంత కీలకమని భావిస్తారు డయానా కెల్లా గ్. ఈ అంశాలను పొందుపరచడం ద్వారానే స్థానికులకు నిర్మాణంతో దృఢమైన అనుబంధం ఏర్పడుతుందన్నది ఆమె అభిప్రాయం. అందు కే ఈ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని, భవన నిర్మాణాలకు అక్కడి వాతావరణానికి అనుగుణంగా ఉండేలా స్థానిక ఇసుకరాయిని ఉపయోగించారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు స్థానిక భవన నిర్మాణ పనివారికి ఉపాధి కూడా కల్పించారామె. ఈ భవనాలు ఆ ప్రాంత తీవ్రమైన వాతావరణాన్ని తట్టుకోవడంతో పాటు తరగతి గదుల లోపలి ఉష్ణోగ్రతను అత్యల్ప స్థాయిలో ఉంచుతాయి. సాధారణంగా ఇక్క డ ఉండే 120 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతను తగ్గించేలా భవనాల పైకప్పుపై సోలార్ ప్యానెల్ పందిరిని నిర్మించి శీతలీకరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. భవనాల దీర్ఘవృత్తాకారం, ధారాళంగా గాలి ప్రసరించేలా ఏర్పాటు చేయబడిన వెంటిలేటర్లు వేడిని తరగతి గదులలోనికి రాకుండా నిరోధిస్తాయి. భవనాలపై ఏర్పాటుచేసిన సౌర ఫలకాలు అక్కడి గరిష్ట ఉష్ణోగ్రతలను వినియోగించుకుని విద్యుదుత్పత్తిని చేస్తాయి. వార్షిక సగటు వర్షపాతం 200 మి.మీ కంటే కొం చెం ఎక్కువగా ఉండే జైసల్మేర్లో ప్రతి నీటి చుక్కను ఆదా చేయడం అత్యంతావశ్యకం. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ భవనాలలో ప్రత్యేకంగా వాన నీటి సంరక్షణ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు.
పర్యావరణానుకూలంగా నిర్మించబడిన ఈ పాఠశాల ప్రాం గణం మొత్తం మూడు వైవిధ్యమైన భవనాల కలయికగా ఉంటుంది. మొదటిది జ్ఞాన కేంద్రం పాఠశాల, రెండవది -మేధాహాల్, మూడవది మహిళా సహకార భవనం. ప్రధాన పాఠశాల భ వనమైన జ్ఞాన కేంద్రం ద్వారా స్థానిక మహిళల కు సాధికారతను కల్పించి వారిని విద్యావంతులను చేస్తారు. తద్వారా వారు వారి కుటుంబా లు ఆర్థికంగా ఎదిగేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ది. ఒక మహిళ ద్వారా మహిళల కోసం రూపకల్పన చేసిన ఈ భవనంలో ప్రత్యేకంగా స్త్రీశ క్తి, అవకాశాలు, స్త్రీత్వాన్ని ప్రతిబింబించేలా మూ డు అండాకారాలను రూపొందించారు. జైసల్మేర్ ప్రాంతంలోని సుందర మనోహరమైన ఇసుక తిన్నెల ప్రతిరూపాలను పొందుపరిచారు.
ఇక్కడ ప్రత్యేకించి స్థానికంగానే కాక దేశ, ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించి వాటి పరిష్కార మార్గాల కోసం సమాలోచనలు జరుపుతారు. మహిళా సహకార కేంద్రం మహిళల కోసం ప్రత్యేకంగా రూ పొందించబడిన నైపుణ్య శిక్షణా కేంద్రం. ఇక్కడ మహిళలకు కుట్లు, అల్లికలు, వివిధ వృత్తుల ద్వారా ఆర్థిక స్వావలంబన సా ధించేలా శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.
మేధాహాల్లో మహిళలు తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శించడానికి, ప్రసిద్ధ డిజైనర్లు, కళాకారులతో తమ నైపుణ్యాభివృద్ధిపై అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఇచ్చిపుచ్చుకునేందుకు ఏర్పాటు చేయబడిన ఒక విశాల ప్రదేశం. ఇక్క డ స్థానిక మహిళా కళాకారులు తమ వస్తువులను ప్రదర్శించడంతో వాటిని విక్రయించుకునే విపణిగా కూడా సహకరిస్తుంది.
ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ ప్రత్యేకంగా రాజకుమారి రత్నావ తి పాఠశాల విద్యార్థినుల కోసం రూపొందించిన బ్లాక్ ప్రింటెడ్ యూనిఫాం వారికి పూర్తి ఉచితం గా అందజేస్తారు. విద్యతో పాటు విద్యార్థినుల శారీరక, మానసిక వికాసానికి తో డ్పాటునందించేలా వలయాకారంలో రన్నింగ్ ట్రాక్, క్రీడా స దుపాయాలు, పెద్ద మైదానం కూడా ఉన్నాయి.
రాజకుమారి రత్నావతి పాఠశాలను ఆదర్శంగా తీసుకుని బాలికల కోసం సామాజిక స్పృహ కలిగిన స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చేయూతనందిస్తే వారి జీవితాలలో ఆనందాలు వెల్లివిరియడమే కాక దేశం కూడా పురోగతి సాధిస్తుంది.
-యేచన్ చంద్ర శేఖర్
88850 50822