60 ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేయడానికి ఎంతోమంది తమ జీవితాలను బలిపీఠం ఎక్కించారు. విద్యార్థుల బలిదానాలతో విశ్వవిద్యాలయాలు అట్టుడికాయి. ఎన్నో యువకెరటాలు ఉరికొయ్యను ముద్దాడాయి. నాలుగుకోట్ల మంది ప్రజల గర్జనతో తెలంగాణ అగ్నిగుండమైంది. వేలాది గొంతుకల జై తెలంగాణ నినాదం ఉద్యమ తీరాన్ని చేర్చింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1969 తొలి ఉద్యమంతోపాటు మ లిదశ ఉద్యమంలోనూ వందలాది మంది ప్రాణాలర్పించారు. తెలంగాణ ఉద్యమానికి అనునిత్యం ప్రేరణగా నిలిచిన అమరవీరుల స్మృతి యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచేందుకు శాశ్వత స్మృతిచిహ్నాన్ని ప్రభుత్వం నిర్మించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త ర్వాత అమరవీరుల స్మృత్యర్థం అత్యాధునిక స్మారక భవనాన్ని ఏర్పాటుచేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ స్మారక భవనంలో తెలంగాణ చరిత్రకు సంబంధించిన సకల వివరాలను తెలియజేసేలా ఏర్పాట్లు చేశారు.
మూడు అంతస్తులుగా నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణాన్ని 42 మీటర్ల ఎత్తులో 10, 300 చ.మీ. విస్తీర్ణంలో భవనమం తా ఏసీ సౌకర్యంతోపాటు మూడు లిఫ్టు లు కూడా ఉండేలా నిర్మించారు. రోడ్లు, భవనాలశాఖ ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ భవన నిర్మాణం కోసం రోజూ 200 మంది పనిచేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో వివిధ రకాల వర్క్ షాపులు నిర్వహించుకునేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు.
10,656 చదరపు అడుగులతో నిర్మిస్తున్న మొదటి అంతస్తులో మ్యూజియం, అమరుల ఫొటో గ్యాలరీ, ఆడియో విజువల్ గదులను ఏర్పాటు చేశారు. 16,964 చదరపు అడుగు ల నిర్మాణం ఉండే రెండోఅంతస్తులో కన్వేన్షన్ హాలు, 8,095 చదరపు అడుగులు ఉండే మూడవ అంతస్తులో రెస్టారెంట్, హుస్సేన్ సాగర్ సమీపంలోని పర్యాటక అందాలను చూడటానికి వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్ర, తెలంగాణ మహానుభావులకు సంబంధించిన ఫొటోలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ భవనం చుట్టూ పచ్చదనంతో కూడిన అతి పెద్ద పార్కును ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు తె లంగాణ చరిత్ర తెలుసుకోవడ మే కాకుండా ఇక్కడ కొంతసేపు సేదదీరేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. 1200 టన్నుల స్టీల్తో కింది నుంచి చివరి అంతస్తు వరకు అమరజ్యోతి నిర్మాణం జరుగుతోంది. పైన 54 X37 మీటర్ల ప్రమిద ఉంటుంది. ఈ ప్రమిదపై 26 మీటర్ల ఎత్తున జ్యోతిని నిర్మిస్తున్నారు. ఈ జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. మూడో అంతస్తు నుంచి జ్యోతికి నివాళులు అర్పించేలా ఏర్పాటు చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్ లెస్ స్టీల్ నిర్మాణంగా ఈ అమరజ్యోతి అరుదైన రికార్డ్ సృష్టించబోతున్నది. 3.29ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ వైవిధ్య నిర్మాణం అంచనా వ్య యం రూ.179 కోట్లు. 48 మీటర్ల ఎత్తులో, 50 మీటర్ల వెడల్పుతో, 28 అడుగుల లోతు లో మూడు అంతస్తులతో వెలుగుతున్న జ్యో తి రూపంలో తెలంగాణా అమరవీరుల స్థూపం ఆకట్టుకోనున్నది. అమరుల జ్యోతి చుట్టూ ప్రదక్షిణలు చేయవచ్చు.ఎటువంటి అతుకులు లేకుండా జ్యోతి భారీ ప్రమిదను పోలిన ఆకారంలో కనిపించడం ఈ నిర్మాణం మరో ప్రత్యేకత. ప్రమిదకు ముందు భాగం లో వెలుగుతున్న ఒత్తి ఆకారంలో ఎత్తైన నిర్మాణం ప్రత్యే క ఆకర్షణ కానున్నది. అమరజ్యోతి చుట్టూ ఆ హ్లాదకరమైన గ్రీనరీతో కూడిన పార్క్లో పై నుంచి కిందకు జూలువారుతున్న నీటి ప్రవాహం, మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. శంకుస్థాపన నాటి నుంచి ఎంతోమంది శిల్పులు ఇచ్చిన తెలంగాణ అమరుల జ్యోతి నమూనాలను పరిశీలించిన ప్రభుత్వం వెంకటరమణారెడ్డి రూపొందించిన న మూనాను ఎంపిక చే సింది. తొలి దశ ఉద్యమంలో తొలి అమరుడైన శంకర్ నుంచి మలిదశ ఉద్యమంలో చివరి వరకు పోరాడిన శ్రీకాంతాచారి లాంటి 1200 మంది అమరవీరులకు ఈ స్మృతి మందిరం అంకితం.
-పేర్వాల నరేష్